J.SURENDER KUMAR,
అనేక రకాల సమస్యలతో పోలీసులను ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ముఖ్య లక్ష్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ అన్నారు.
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 21 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ సమస్యల విషయంలో అన్ని కోణాలలో సమగ్రంగా విచారణ చేసి, క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకొని అందుకు అనుగుణంగా బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.