గోమాతను వధిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా ? ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా ?

స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే కేసులు పెడతారా ?

ధర్మపురి సంఘటనపై ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ !

J. SURENDER KUMAR.

బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో గురువారం పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గం. పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయం అని కరీంనగర్ ఎంపీ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటన లో పేర్కొన్నారు.
ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి
గోమాతను వధించడాన్ని నిరసిస్తూ ధర్మపురి ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం హర్షణీయం. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వారిని పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేయడం సహించరాని విషయం అని పేర్కొన్నారు.
గోమాతను వధించడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ చట్టాన్ని అమలు చేయకపోవడం కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం. తాను నిఖార్సైన హిందువునని పదేపదే చెప్పుకునే కేసీఆర్ ఎందుకు ఈ విషయంపై స్పందించడం లేదు అన్నారు.
తక్షణమే అమాయకులపై పెట్టిన నాన్ బెయిలెబుల్ కేసులను ఉపసంహరించుకోవాలి. అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో రేపు నేనే స్వయంగా ధర్మపురి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ బండి సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.