ప్రజా సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి! పోలీస్ గ్రీవెన్స్ లో ఫిర్యాదులు…

జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్


J.SURENDER KUMAR,

ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 26 మంది అర్జీదారులతో జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

వచ్చిన పిర్యాదులు భూ సమస్యలు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఫైనాన్స్, గల్ఫ్ కు పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందని. ఎస్పి తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమస్యలను స్వస్థరంగా పరిష్కరించడానికి తాను పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని అన్నారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతీ ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.