రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది! బాగుంటుంది.!

👉వరుసగా ఐదో ఏడాది మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 7,500 చొప్పున !


👉52,30,939 రైతన్నల ఖాతాల్లో ₹ 3,923.21 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ!


👉 రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా ₹13,500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సాయం !


👉పీఎం కిసాన్‌ క్రింద రావాల్సిన ₹2000 కూడా ఆ నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం!


👉ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

రైతు బాగుంటేనే రాష్ట్రం దేశం బాగుంటుందని నమ్మే మీ బిడ్డ ప్రభుత్వం, మీ ప్రభుత్వం.ఈ రోజు రైతన్నల కోసం, పొలాల్లో శ్రమించే ఆ కష్ట జీవుల కోసం  పత్తికొండ నియోజకవర్గం నుంచి దేవుడి దయతో మరో మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం.
దాదాపుగా 52.30 లక్షల మంది రైతన్నల కుటుంబాలకు ఈ రోజు బటన్‌ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి రూ.3900 కోట్లు జమ చేయబోతున్నాం అని గురువారం పత్తికొండలో జరిగిన భారీ బహిరంగ సభలో. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
2023 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు 30,382 హెక్టార్లలో పంట నష్టపోయిన 47,999 మంది రైతులకు రూ.44.19 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట కోతల అనంతరం వర్షాల వల్ల కల్లాల్లో పంట దెబ్బతిన్న 3,469 మంది జొన్న, మొక్కజొన్న రైతులకు రూ.9.43 కోట్ల ప్రత్యేక పరిహారంతో కలిపి రూ.53.62 కోట్ల పెట్టుబడి రాయితీని నష్టపోయిన రైతులకు బటన్‌ నొక్కి నేడు వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు.

సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలో…


👉వరుసగా ఐదో ఏడాది– తొలివిడత సాయం..
ఈ రోజు మేనిఫెస్టోలో రైతన్నలకిచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకునే ప్రభుత్వంగా వైఎస్‌ఆర్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ ఐదో ఏడాది తొలివిడత సాయం ఇక్కడ నుంచే విడుదల చేస్తున్నాం. రైతన్నలకు తాను పంట పండించే సమయానికి ఆ రైతన్న ఇబ్బంది పడకూడదు, పెట్టుబడి కోసం రైతన్న అప్పులు పుట్టని పరిస్థితి ఉండకూడదని, ఇబ్బంది పడకూడదని ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం.
👉చెప్పిన దాని కన్నా మిన్నగా – రైతుభరోసా…
రాష్ట్రంలో ఇవాళ 1 హెక్టారు కూడా లేని రైతులు దాదాపు 70 శాతం మంది ఉన్నారు. అర హెక్టారు లోపు ఉన్న రైతులు దాదాపు 50 శాతం ఉన్నారు. అటువంటి ప్రతి రైతుకు మంచి జరగాలన్న తపనతో ప్రతియేటా రూ.12,500 చొప్పున నాలుగు సంవత్సరాలలో రైతలు చేతుల్లో రూ.50వేలు పెడతామని ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రకటించాం. ఈ రోజు మీ బిడ్డ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పినదానికన్నా మిన్నగా… ఈ రోజు రూ.13,500 ఇస్తున్నాం.
👉నాలుగేళ్లు అని మేనిఫెస్టోలో చెప్పినా.. రైతులు ఇబ్బంది పడకూడదని ఐదేళ్లు ఇస్తామని చెప్పి.. రూ.50వేలు కాకుండా రూ.67,500 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెప్పినదానికన్నా మిన్నగా.. ప్రతి రైతుకు రూ.17,500 ఎక్కువగా ఇచ్చే దిశగా అడుగులు వేశాం. ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పై చిలుకు మంది రైతులకు.. ప్రతి రైతుకు రూ.54వేలు వైఎస్‌ఆర్‌ రైతుభరోసాగా ఆ కుటుంబం చేతిలో పెట్టాం. ఈ దఫా ఇచ్చే రూ.7,500 కలుపుకుంటే ప్రతి రైతన్న కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రూ.61,500 ఇచ్చినట్టవుతుంది. రైతు భరోసా కింది ఏటా మూడు విడతల్లో అందిస్తున్న సహాయాన్ని ఐదో ఏడాది తొలివిడతగా ఈ దఫా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి అక్షరాలా రూ.3923 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి రైతుకు రూ.5,500 రైతు భరోసా పీఎం కిసాన్‌ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ రోజు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తుంది. మిగిలిన రూ.2వేలు త్వరలో పీఎం కిసాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి మీ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. వాళ్లు ఇచ్చేది కాస్తా ఆలస్యమైనా నా రైతన్నలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో.. మీ బిడ్డ కచ్చితంగా మే నెలలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జరిపిస్తూ మీ ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ చేస్తున్నాం.
👉ఒక్క రైతు భరోసాతోనే రూ.31వేల కోట్లు సాయం.
ఈ రోజు వరకు మీ బిడ్డ ప్రభుత్వం నేరుగా 52.30 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి కేవలం రైతు భరోసా అన్న ఒక్క పథకం ద్వారానే… రూ.31 వేల కోట్లు జమ చేశాం.
ఈ రోజుమరో మంచి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చే విషయంలో ఒక విప్లవాత్మక మార్పును మీ బిడ్డ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఏ సీజన్‌లోనైనా పంట నష్టం జరిగితే… ఆ సీజన్‌ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బులు పెడితే ఆ రైతన్న తన కాళ్లమీద తాను నిలబడగలుగుతాడని చెప్పి… ఇన్‌పుట్‌ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం మనదే.
👉రూ. 54 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ.
ఈ సారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా ఆలస్యం లేకుండా, రైతన్న ఇబ్బంది పడకూడదని ఈ సంవత్సరం మార్చి, ఏఫ్రిల్, మే నెలల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 51వేల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.54 కోట్లను ఇన్‌పుట్‌ సబ్సిడీగా జమ చేస్తున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా 22.70 లక్షల మంది రైతన్నలకు ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఈ సీజన్‌లో రైతన్నలను ఆదుకుంటూ ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో రూ.1965
కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశాం.
👉సాగులో విప్లవాత్మక మార్పులు..
మన ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయింది. ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ.. విప్లవాత్మక మార్పులు ఈ రంగంలో తీసుకొచ్చాం.
మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్లో గొప్పది..
👉రైతు భరోసా కేంద్రాలు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు హయాలంలో ఇలాంటి ఆలోచన అయినా ఆయనకు తట్టిందా? రైతు భరోసా కేంద్రాల ఊసే అప్పుడు లేదు. మన ప్రభుత్వంలో గ్రామస్ధాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు, తోడుగా నిలబడేందుకు.. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, చేయిపట్టుకుని నడిపిస్తూ.. 10778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసాం. అన్నదాతకు నిరంతరంగా తోడుగా,అండగా ఉంటూ వారితో పాటు కలిసి అడుగులు వేస్తున్నాం. దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల మీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రేమ వీటన్నింటినీ ఒక్కచోటుకి తీసుకొస్తే.. దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది.
2014–19 మధ్య కాలంలో ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి అప్పట్లో ఏటా 153 లక్షల టన్నుల మాత్రమే ఉంటే… మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు ప్రతిఏటా సగటున 165 లక్షల టన్నులకు చేరింది. ఉద్యాన పంటల దిగుబడి గమనిస్తే.. చంద్రబాబు హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నుల మాత్రమే ఉంటే…మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏకంగా 332 లక్షల టన్నులకు పెరిగింది. తేడా గమనించండి.
👉బాబు పాలనంతా కరువే..
గతంలో చంద్రబాబు హయాలంలో ఏ సంవత్సరం చూసుకున్నా కరువే.. కరువు. బాబు హయాలంలో ప్రతి సంవత్సరం కనీసం సగం మండలాలు కరవు మండలాలుగా ప్రకటించే పరిస్థితి. అప్పట్లో 1623 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో సగం మండలాలు ఎప్పుడు కరవు మండలాలుగానే ఉండేవి. దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మీ బిడ్డ పరిపాలన ప్రారంభమైన తర్వాత దేవుడిదయతో మంచి వానలు పడ్డాయి. కరువులు లేవు. వలసలు కూడా తగ్గాయి.
👉నాటికీ – నేటికీ తేడా చూస్తే…
దేవుడి దయ వల్ల ఈ నాలుగు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా కరవు మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పాలన సాగింది. గతంలో చంద్రబాబు పాలనలోని ఐదేళ్లలో సున్నా వడ్డీ కింద రుణాల మీద 40.60 లక్షల మంది రైతన్నలకు కేవలం రూ.685 కోట్లు మాత్రమే అందిస్తే.. మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో రైతులకు సున్నావడ్డీ కింద రూ.1835 కోట్లు ఇచ్చాం. 74 లక్షల మంది రైతులకు సున్నావడ్డీ ద్వారా మంచి చేయగలిగాం.
👉చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ కింద  ఇవ్వకుండా పెట్టిన బకాయిలు సైతం మీ బిడ్డ హయాంలో చిరునవ్వుతో చెల్లించాం.
గతంలో చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మంది రైతులకు కేవలం ఐదేళ్లలో రూ.3411 కోట్లు పంటల బీమా కింద ఇస్తే… మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగు సంవత్సరాలలో మాత్రమే వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకంలో 44లక్షల మంది రైతన్నలకు రూ. 6685 కోట్లు బీమాగా చెల్లించాం. ఈ సంవత్సరం కూడా నిరుడు ఖరీప్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్‌ సొమ్ము కూడా జూలై 8, (నాన్నగారి పుట్టిన రోజు) వైఎస్‌ఆర్‌ జయంతి రోజున జమ చేయనున్నాం.
👉ఒక్క రూపాయి కూడా రైతన్నలు బీమా ప్రీమయం కట్టాల్సిన అవసరం లేకుండా.. గతంలో ఎన్నడూ జరగని విధంగా, పూర్తిగా బీమా ప్రీమియం కూడా తానే భరిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మనదే.
మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఇ–క్రాప్‌ బుకింగ్‌ జరుగుతుంది.  రైతుల పేరులన్నీ సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేలలో డిస్‌ప్లే చేస్తున్నారు. గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా మంచి చేస్తున్నారు. ఇవన్నీ మీ బిడ్డ హాయంలోనే జరుగుతున్నాయి.
గత చంద్రబాబు ప్రభుత్వ హయాలంలో ఇ– క్రాప్‌ అనే మాటే లేదు. ఆర్బీకే అన్న మాటే లేదు. సోషల్‌ ఆడిట్‌ కింద మొత్తం జాబితా పెట్టాలన్న ఊసే లేదు. గత పాలనకు, ఈ పాలనకు మధ్య తేడా గమనించండి.
👉ధాన్యం సేకరణలో నాడు– నేడు
మరోవైపు ధాన్యం సేకరణ మీద కూడా గతానికి ఇప్పటికి ఉన్న తేడా గమనించండి.
గతంలో ఆ ఐదు సంవత్సరాల కాలంలో సేకరించిన మొత్తం ధాన్యం 2.65 కోట్ల టన్నులు అయితే, మన ప్రభుత్వంలో నాలుగేళ్లలో సేకరించిన ధాన్యం మొత్తం 3.09 కోట్ల టన్నులు. ఇంకా రబీలో సేకరణ జరుగుతుంది. ఎన్నికల్లోగా మరో ఏడాది ధాన్యం సేకరణ మళ్లీ జరుగుతుంది.  గతంతో పోలీస్తే.. అప్పుడు ఏటా సగటున 53 లక్షల టన్నుల సేకరిస్తున్న పరిస్థితి నుంచి ఇవాళ సగటున ఏటా 75 లక్షల టన్నుల సేకరిస్తున్నాం.
ధాన్యం సేకరణపై గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన వ్యయం రూ.40,237 కోట్లు అయితే మన ప్రభుత్వంలో ఈ నాలుగేళ్లలో ఇప్పటికే రూ.60వేల కోట్లు ధాన్యం సేకరణ కోసం ఖర్చు చేశాం. రబీ పూర్తి కాలేదు. ఐదేళ్లకు ఇంకా మరో ఏడాది పెండింగ్‌ ఉంది. అది కూడా కలుపుకుంటే కనీసం రూ.77వేల కోట్లు అవుతుంది. తేడా మీరే చూడండి.
👉అగ్రి టెస్టింగ్‌ ల్యాబులు…
విత్తనాలు దగ్గర నుంచి ఎరువులు వరకు నకిలీలు గుర్తించే విషయంలోనైనా, భూసార పరీక్షలు చేసే విషయంలోనూ, గత ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపించలేదు. మన ప్రభుత్వంలో ఇప్పటికే 70 నియోజవర్గస్ధాయిలో అగ్రిటెస్టింగ్‌ ల్యాబులు కనిపిస్తున్నాయి.
2 జిల్లా స్ధాయి ల్యాబులు, మరో 4 రీజనల్‌ కోడింగ్‌ సెంటర్లు కూడా ఏర్పాటయ్యాయి. ఇవి కాకుండా మరో 77 నియోజకవర్గాల్లో అగ్రిటెస్టింగ్‌ ల్యాబులు కడుతున్నాం. మరో 11 జిల్లా స్ధాయి ల్యాబ్స్‌ నిర్మాణం మొదలయ్యింది. ఆర్బీకే స్ధాయిలో కూడా సీడ్‌ టెస్టింగ్,
సాయిల్‌ టెస్టింగ్‌ దిశగా అడుగులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్బీకేలు గ్రామ స్ధాయిలో రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసే విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి.
👉100 ఏళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే..
మరికొన్ని విషయాలు కూడా మీకు చెప్పాలి. రైతన్నలకు పంట ఎంత ముఖ్యమో.. భూమిమీద సర్వహక్కులు కూడా వారికి అంతే ముఖ్యం.వందేళ్లక్రితం బ్రిటీష్‌ హయాంలో భూసర్వే జరిగితే… ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. గ్రామస్ధాయిలో సరిహద్దు రాళ్లు లేవు. గ్రామస్ధాయిలో సబ్‌డివిజన్‌ అప్‌డేట్‌ కార్యక్రమం కూడా జరగలేదు. భూవివాదాలు గ్రామాల్లో మన కళ్లెదుటనే కనిపిస్తున్నా.. పరిష్కారం రాని పరిస్థితులలో రైతులు ఉన్నారు.  ఈ విషయం తెలిసిన ప్రభుత్వంగా..  వీరికి మంచి జరగాలని మన ప్రభుత్వం హయాంలో వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే నిర్వహించి, నిర్ధిష్టంగా సరిహద్దులు నిర్ణయించి, సర్వేరాళ్లను పాతించి, రికార్డులన్నీ అప్‌డేట్‌ చేయించి, వివాదాలకు ఏమాత్రం తావులేకుండా రైతన్నల చేతిలో భూహక్కు పత్రాలను పెట్టే గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది.
👉గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్లు…
గ్రామ సచివాలయాలన్నింటిలోనూ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో జరగబోయే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలన్నీ అక్కడే జరగాలన్న ఆలోచనతో.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
ఎప్పుడూ జరగని విధంగా, ఎవ్వరూ ఊహించని విధంగా రైతన్నలకు భూముల మీద ఉన్న సర్వహక్కులు వారికి ఇప్పించాలని తపన, తాపత్రయంలో అడుగులు వేస్తున్నాం. చుక్కల భూముల మీద, బ్రిటీష్‌ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న భూముల మీద, గత ప్రభుత్వ హయాలంలో నిషేధిత జాబితాలో పెట్టిన భూముల మీద సర్వహక్కులూ రైతులకు ఇస్తూ.. లక్షల ఎకరాల మీద పూర్తి హక్కులు ఇచ్చిన ప్రభుత్వం మనది.
👉9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ కోసం.
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నిరంతరాయంగా రైతులకు ఏ ఇబ్బంది రాకూడదని, పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే. రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే.. రూ.1700 కోట్లు ఖర్చుపెట్టి ఫీడర్లను బలపరుస్తే తప్ప ఉచిత విద్యుత్‌ ఇవ్వలేమంటే మీ బిడ్డ హయాంలో ఆ ఖర్చు కూడా చేసి ఫీడర్లను బలపర్చే కార్యక్రమం చేశాం.
👉ఆక్వా సాగుకు సాయంగా…
ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదే. ఇప్పటివరకూ ఈ ఆక్వా రైతులకు మంచి చేస్తూ.. వాళ్లందరి తరపున నిలబడి వారికి రూ.2967 కోట్ల సబ్సిడీ రూపేణా ప్రభుత్వం భరించింది.
దేవుడి దయతో ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు సమృద్ధిగా కురవడం వల్ల కరవుసీమగా పేరున్న రాయలసీమ కూడా కళకళలాడుతుంది. రిజర్వాయర్లు అన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. భూగర్భ జలాలు కూడా ఎప్పుడూ ఊహకందని విధంగా పెరిగాయి. రైతన్నలకు తోడుగా నిలుస్తున్న ప్రభుత్వంగా, అక్కచెల్లెమ్మలకు ఇంకా మంచి జరగాలి, రైతన్న వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, వ్యవసాయం మీద వచ్చే ఆధాయానికి అదనంగా ఇంకా ఆధాయం రావాలని చెప్పి వారికి తోడుగా నిలబడుతూ.. అక్కచెల్లెమ్మలకు మరో నాలుగు రూపాయలు అదనంగా రావాలన్న తపనతో అమూల్‌ను తీసుకొచ్చి, రాష్ట్రంలో రంగ ప్రవేశం చేయించాం. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన అమూల్‌ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టించాం.
👉అమూల్‌– పాడి రంగంలో మార్పులు..
అమూల్‌ ఇక్కడకు వచ్చింది కాబట్టి.. అంతకముందు దోచుకుంటున్న హెరిటేజ్‌ వంటి పాలడెయిరీలన్నీ తలవంచి పాడిరైతులకు ఇచ్చే ధర పెంచాల్సి వచ్చింది. అమూల్‌ వచ్చేనాటికి ఇప్పటికీ పాలధరల్లో తేడా చూస్తే… అమూల్‌ వచ్చిన తర్వాత నాలుగు సందర్భాలలో ధరలు పెంచుకుంటూ పోయింది. లీటరుకు రూ.10 నుంచి రూ.17 వరకు ధర అమూల్‌ పెంచింది. దీంతో హెరిటేజ్‌ వంటి పాలడెయిరీలు కూడా రేటు పెంచకతప్పనిసరి పరిస్థితి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తోంది.
మీ బిడ్డ హయాంలో ఆర్బీకే స్ధాయిలోనే ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అన్నది పోస్టర్లు ద్వారా డిస్‌ప్లే చేశాం. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్‌పీ ప్రకటించని ఆరు పంటలకు కూడా మద్ధతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మార్కెట్‌లో పోటీ పెరిగి ఈ రోజు ప్రతీ రైతన్నకు కనీస గిట్టుబాటు ధర ఆర్బీకే స్దాయిలోనే వచ్చేట్టు, దళారులు లేకుండా అమ్ముకునే కార్యక్రమం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరుగుతోంది.
👉మూగజీవాల కోసమూ..
పశునష్టపరిహారం కింద రూ.667 కోట్లు చెల్లించాం. ఆయిల్‌ఫాం రైతులను ఆదుకునేందుకు రూ.85 కోట్లు ఇచ్చాం. వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత ద్వారా 5 లక్షల మంది అక్కచెల్లెమ్మలు పశుసంపద కొనుగోలుచేసి.. తద్వారా అదనపు ఆదాయం వచ్చేందుకు తోడుగా నిలబడ్డాం.
వైఎస్‌ఆర్‌ పశు ఆరోగ్యసేవలో భాగంగా పశువులకు సైతం 340 ఆంబులెన్స్‌లు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో యానిమల్‌ డిసీజెస్‌ డయాగ్నొస్టిక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యాయి.
👉చంద్రబాబు పెట్టిన బకాయిలూ చెల్లించాం.
చివరకు గత ప్రభుత్వ హయాంలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది.
అప్పట్లో చంద్రబాబు బకాయిలుగా పెట్టి ఎగ్గొట్టి పోయిన రూ.384 కోట్ల విత్తన బకాయిలూ మన ప్రభుత్వమే చెల్లించింది. రూ.8845 కోట్ల మేర చంద్రబాబు ఎగ్గొట్టి పోయిన విద్యుత్‌ బకాయిలునూ రైతన్నల కోసం మన ప్రభుత్వమే చెల్లించింది. ఫామ్‌ మెకనైజేషన్‌ అన్నది ఎప్పుడూ జరగని  విధంగా చేస్తున్నాం. గతంలో ఎవరికిచ్చామో, ఎందుకిచ్చామో తెలియదు అన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఒక విధానం తీసుకొచ్చాం.
👉ఫామ్‌ మెకనైజేషన్‌…
ప్రతి ఆర్బీకే స్దాయిలో ఒక సీహెచ్‌సీ(కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ను) స్ధాపించాం. ప్రతి ఆర్బీకే స్దాయిలోనూ ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఫామ్‌ మెకనైజేషన్‌ కోసం రూ.1052 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికాలను ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. ప్రతి ఆర్బీకే స్ధాయిలో రైతులు ఒక గ్రూప్‌ కింద ఏర్పడి వారు కేవలం 10 శాతం చెల్లిస్తే.. 40 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మరో 50 శాతం రుణం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఆర్బీకే స్ధాయిలోనే దాదాపు రూ.15 లక్షలు విలువ చేసే ట్రాక్టర్లు వంటి వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఈ గ్రూపులో ఉన్న రైతులు ఆ వ్యవసాయ ఉపకరణాలను మిగిలిన రైతులకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చి వారికి మేలు జరిగే విధంగా ఆర్బీకే స్ధాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాం. వ్యవసాయ యంత్రీకరణ అన్నది ఇప్పుడు అర్ధవంతంగా సాగుతుంది. వ్యవసాయంలో మొట్టమొదటిసారిగా ఆర్బీకే స్ధాయిలోనే డ్రోన్లు తీసుకువచ్చే గొప్ప అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ మన రైతులే డ్రోన్లు ద్వారా వ్యవసాయం చేసే గొప్ప రోజులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవసాయం మీద అపారమైన ప్రేమ ఉన్న ప్రభుత్వంగా.. బాధ్యతతో, రైతుల మీద మమకారంతో చేసాం.
నేరుగా రైతులకిస్తున్న పథకాలతో పాటు ప్రతి రైతుకు మేలు జరిగేటట్టుగా నవరత్నాల్లోని దాదాపు అన్ని పథకాలను కూడా  పేద కుటుంబాలన్నింటికీ వర్తించే విధంగా వాటిని తయారు చేసి అమలు చేస్తున్నాం. రైతుల కోసం ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మనది అయితే.. మరోవంక రైతుకు శత్రువైన చంద్రబాబు నాయుడుని చూడండి.
👉సాగు దండగన్న బాబు..
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలు బట్టలు ఆరేసుకోవడానికే ఆ తీగలు తరమవుతాయని చెప్పాడు. తొలి సంతకంతో మొత్తం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని ఊరూరా చెప్పి, పొరపాటున ఓటు వేసిన రైతులను చంద్రబాబు నిలువుగా ముంచాడు.
జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.