J.SURENDER KUMAR,
విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో షీ టీం , యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ టీంల పని తీరు పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ…. మహిళలు, మరియు చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామన్నారు. మహిళల పై నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల, నుండి రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు షి టీమ్స్ ఏర్పాటు ద్వారా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు. మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఆకతయులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు ఫోన్ నెంబర్ 8712670783, డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని అన్నారు.

జిల్లాలో గత ఆరు నెలల్లో షీ టీమ్స్ బృందాలు ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై 69 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సుమారు 7000 మంది విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. షీ టీమ్ ద్వారా 27 ఫిర్యాదులు రాగా 3 FIR లు,13 పెట్టి కేసులు లు నమోదు చేయడం జరిగింది. మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న 11 మందికి వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, షీ టీమ్ ఎస్.ఐ వెంకటేశ్వర్లు , ASI వాలీబెగ్, మహిళా కానిస్టేబుల్ లు పాల్గొనరు.