ప్రతిదినం – ప్రజాహితం ‘ డైరీ రూపకల్పన అద్భుతం – అభినందనీయం !

ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్

J. SURENDER KUMAR,

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్న తీరును, డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం, అద్భుతం అభినందనీయం అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయం ప్రచురించిన “ప్రతిదినం ప్రజాహితం” వికాస వార్షిక – 4 వ సంవత్సరం ముఖ్యమంత్రి రోజువారి కార్యక్రమలను తెలియజేసే దినచర్య డైరీ ని గురువారం దిల్లీ ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని తన కార్యాలయంలో ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, రోజువారీ అధికారిక కార్యక్రమాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో, సంకలనం చేసిన విధానం, జాతీయ మీడియా సలహాదారు కార్యాలయం దానిని డైరీ రూపంలో ప్రచురించడం అభినందనీయం అని ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.
తన కార్యాలయ రోజువారీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి దినచర్యను కూడా అనుసరిస్తూ ఒక బాధ్యతగా తీసుకుని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ డైరీ ని రూపొందించడం జరుగుతున్నది అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు.
డైరీ ముద్రణకు సహకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్, కమిషనర్ , తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పుస్తక రచయిత పాలెపు రాజ శేఖర్ ను సలహాదారులు అభినందించారు.
జాతీయ మీడియా సలహాదారు కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ బి. ఎస్. రామకృష్ణ, ఎపిఆర్వో కే. గురవయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
.