రైతాంగానికి మొదటి శత్రువులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు – రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ !

జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత !

J.SURENDER KUMAR,

తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి శత్రువులు కాంగ్రెస్ బిజెపి పార్టీలు, సీఎం కెసిఆర్ ఒక్కరే రైతుల పక్షపాతి అని జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదని టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన గా బుధవారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా జెడ్పీ ఛైర్పర్సన్ మాట్లాడుతూ….
👉 3గంటలు కరెంట్ ఇవ్వాలని రేవంత్ చేసిన వాక్యాలను ఖండిస్తున్నాం.
👉 కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను గోస పెట్టాలని చూస్తున్నారు.
👉రైతులను పొట్టన పెట్టుకోవాలనే నైజం నేడు బయట పడింది.
👉 కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరంకు కూడా నీరు పారలేదని అనే వారికి …ఒక్క తూము పెట్టి అంతర్గం చెరువు నుండి చుట్టూ ప్రాంతాల చెరువులు జలకల సంతరించుకున్న జగిత్యాల నియోజకవర్గం లో మీకు కండ్లు కనిపిస్తలేదా?


👉 కంటి పరీక్ష శిబిరల్ని ఏర్పాటు చేసి బిజెపి కాంగ్రెస్ నేతలకు కంటి పరీక్షలు చేయాలి అని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నాం.
👉బిజెపి కాంగ్రెస్ ఇద్దరు దొంగలే. దొంగ బాండ్ పేపర్ తోఎంపీ గా గెలిచిన అర్వింద్ నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పసుపు రైతులకు ఎం చేశాడో చెప్పాలి అంటూ పలు ఆరోపణలు చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, టిఆర్ఎస్ శ్రేణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.