మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం !

J.SURENDER KUMAR

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదముద్ర వేశారు. దీంతో బిల్లు.. చట్టంగా మారింది. దీనిపై కేంద్ర న్యాయ శాఖ గెజిట్ విడుదల చేసింది.
పార్లమెంట్‌ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. దీంతో మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం దాల్చింది.

లోక్‌సభ, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభల్లో మహిళలకు కేంద్రం 33శాతం రిజర్వేషన్లు కల్పించింది.


జనాభా లెక్కల తర్వాత చేపట్టే డీలిమిటేషన్‌ అనంతరం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేసే తేదీ నుంచి ఇది అమలవుతుంది.