J.SURENDER KUMAR,
వచ్చేనెల అక్టోబర్ 3న ఐటీ, శాఖ మంత్రి కేటీఆర్ ధర్మపురిలో పర్యటించనున్న నేపథ్యంలో సంక్షేమ శాఖ మంత్రి ఈశ్వర్ , కలెక్టర్ యాస్మన్ బాషా, ఎస్పీ ఎగ్గడి భాస్కర్, కలిసి శుక్రవారం మాతా శిశు కేంద్రం, ఫైలాస్, హెలిప్యాడ్ కళాశాల మైదానాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.
నూతనంగా నిర్మాణం అవుతున్న ఫైలాన్ బహిరంగ సభాస్థలి, కావాల్సిన ఏర్పాట్లు, మాతా శిశు ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మంత్రి కలెక్టర్, ఎస్పీ లకు దిశానిర్దేశం చేసారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ బత్తిని అరుణ, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ సునిల్, అడిషనల్ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు