👉 ఎన్నికల నియమావళి పై అదికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలి !
👉 ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !
J.SURENDER KUMAR.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం నిబంధనలు పాటిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికలు నిర్వహణలో పోలీస్ ల పాత్ర చాలా కీలకమైందని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ అన్నారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లొ సోమవారం రాబోవు రాష్ట్ర శాసనసభ ఎన్నికల నియమావళి, ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులు తీసుకోవలసిన చర్యలపై మాస్టర్ ట్రైనర్ పడల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ చే శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణలొ, పర్యవేక్షణ మరియు క్రమశిక్షణకు లోబడి పని చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లాలొ 5 నియోజకవర్గాల పరిధిలో ఉందన్నారు.
ఇప్పటికే ఎన్నికల విధులకు సంబంధించి పోలీస్ సెక్టార్ అధికారులను నియమించడం జరిగిందని .ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు ప్రకారం ఎన్నికలను ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలి అని అన్నారు. ఒకటికి రెండుసార్లు విషయాలు తెలుసుకొని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.

పోలీసు అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామాలలో ఎలాంటి సమస్యలు లేకుండా, సమస్యలు సృష్టించే వారినీ బైండోవర్ చేయాలని తెలిపారు. ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో సమస్యలును సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలీస్ అధికారులు ఎలక్షన్ సమయంలో సమస్యలు సృష్టించే వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నికల నియమావళి పై పోలీసు అధికారులకు అవగాహన కలిగించిన మాస్టర్ ట్రైనర్ పడాల తిరుపతి ని సన్మానించి, ప్రశంస పత్రం అందజేశారు.
ఈ శిక్షణ కార్యక్రమo లో అదనపు ఎస్పీ ప్రభాకర రావు, డి ఎస్పీలు రవీంద్ర కుమార్ వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, రఘు చందర్, D.V రంగారెడ్డి , SB,CCS ఐటీ core ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు,సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.