జగిత్యాల జిల్లా లో 9 మందిపై పిడి యాక్ట్!

👉 కోరుట్ల కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజం హత్య కేసులో 9 గురు నిందితులపై


👉 నిందితులకు కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.


👉 శాంతిభద్రతలకు మరియు సామాజిక శాంతికి భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం


జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ !

J.SURENDER KUMAR,

కోరుట్ల కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజం హత్య కేసులో 9 గురు నిందితులపై ఈ రోజు పీడి ఆక్ట్ అమలు చేయడం జరిగిందని పీడి ఆక్ట్ నమోదు చేసిన ఉత్తర్వుల ప్రతినిని నిందితులకు కరీంనగర్ జైల్లో అందజేసి వారిని చర్లపల్లి జైలుకు తరలించినట్టు సోమవారం ఎస్పీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు.


పీడీ యాక్ట్ నమోదు చేసిన నిందితుల వివరాలు


👉 విత్తనాల నాగరాజు S/0 పోతరాజువిత్తనాల

👉 తిరుపతి S /0 పోతరాజు.

👉 కాసుల వంశీ ప్రసాద్ S/0 గంగారెడ్డి

👉 పిల్లి సత్యనారాయణ S/0
రాములు

👉 గుడ్ల విశాల్ S/0పుందరికం

👉 కాసుల మధుమోహన్ S/0 గంగారెడ్డి.

👉 మర్త నరసింహ S/0 బాబు.

👉మారుపాక ప్రభాస్ S /0 అంజయ్య.

👉 శ్రీరాముల దీపక్ S/0 అశోక్.


ఆగస్టు 8న కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా కి ఎదురుగా ఉన్నటువంటి శంకర్ టీ స్టాల్ నందు ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి మాస్క్ ధరించి టీ తాగడానికి వచ్చిన స్థానిక కోరుట్ల కౌన్సిలర్ భర్త లక్ష్మీరాజంపై కత్తులతో ఒక్కసారిగా దాడి చేసి మోటార్ సైకిల్ పై పారిపోయారు అని చెప్పారు.. గాయాల పాలైన లక్ష్మీరాజంను కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అదే రోజు మృతుని భార్య పోగుల ఉమారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 9 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది ఇందులో 9 మందిని పైన ఈరోజు పీడి యాక్ట్ నమోదు చేయడం జరిగింది.
నియంత్రణ చట్టం 1986 (చట్టం సంఖ్య 1/1986), తెలంగాణా నియంత్రణ చట్టం ( సవరణ చట్టం సంఖ్య 13/2018) ప్రకారం వీరు నేరాలకు పాల్పడే నేరస్తుని గా నిర్ధారించి, వీరి బారి నుండి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పి.డి. యాక్ట్ పెట్టడం జరిగిందన్నారు.
నిందితులు సాధారణ ప్రజల మనసుల్లో భయాందోళనను సృష్టిస్తూ శాంతిభద్రతలకు విగాధం కలిగిస్తూ ప్రజా జీవనంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తూ మరియు ప్రజల మనసుల్లో భయాందోళనలు సృష్టించి శాంతిభద్రతలకు మరియు సామాజిక శాంతికి భంగం కలిగిస్తున్నారు. ఇట్టి నిందితులపై గతంలో కేసులు నమోదు కావడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ఎవరైనా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన డిఎస్పి రవీంద్ర రెడ్డి, కోరుట్ల సీ.ఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ లను ఎస్పీ అభినందించారు.