J.SURENDER KUMAR,
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు పోలీసులు విస్తృత తనిఖీలలో పట్టుబడిన అన్ని రకాల మొత్తం విలువ ₹130 కోట్ల 26 లక్షల 91 వేల 531గా అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ, సరైన పత్రాలు లేని నగదు, బంగారు ఆభరణాలను సీజ్ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ చర్యలనూ ఉపేక్షించడం లేదు. కార్లను మొదలుకొని ఆర్టీసీ బస్సులు, బైకులు ఇలా ప్రతి వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు.

👉 ఇప్పటి వరకు పట్టుబడిన నగదు ₹ 71 కోట్ల, 55 లక్షల 58 వేల 94 రూపాయలు.
👉 52,091 లీటర్ల మద్యం, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల ఆలం స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ మొత్తం ₹ 7 కోట్ల 75 లక్షల 79 వేల 917 రూపాయలు.
👉 ₹.4 కోట్ల 58 లక్షల 4720 విలువైన 1694 కిలోల గంజాయి పట్టుబడింది.
👉 72 కిలోలకు పైగా బంగారం, 420 కిలోలకు పైగా వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ మొత్తం ₹.40 కోట్ల 8 లక్షల 44 వేల 300/- రూపాయలు. స్వాధీనం
👉 ల్యాప్టాప్లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి మొదలైన కానుకల విలువ ₹.6 కోట్ల 29 లక్షల 4 వేల 500/- రూపాయలు అని అధికారులు స్పష్టం చేశారు.