ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,
J.SURENDER KUMAR,

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనదని, ఆ ఎన్నికల పక్రియ శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్క పోలీసులు పోలీసు అధికారులు సమిష్టిగా విధులు నిర్వహించాలని, జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, అన్నారు.
ఎన్నికల నేపద్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించవలసిన విధులు విధానాల పై జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎస్పి గురువారం సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
. ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజూ,పోలింగ్ ముందు రోజు, పోలింగ్ తరువాతి రోజు పోలీస్ సిబ్బంది నిర్వహించవలసిన విధుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారి పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ బస చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఆ యొక్క ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి ఒక్క అధికారికి తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ లొకేషన్లు, పోలింగ్ కేంద్రాలు, రూట్ మొబైల్ గురించి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్.ఐ మరియు బ్లూ కోల్ట్ సిబ్బంది పోలింగ్ కి రెండు మూడు రోజుల ముందు నుండి 24/7 పెట్రోలింగ్ చేస్తూ ఎన్నికల నియమావళి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యల గురించి, పట్టిష్టమైన బందోబస్తు,కేంద్ర బలగాలు వినియోగం పై తగు సూచనలు సలహాలు చేశారు.. పోలింగ్ కేంద్రాలలో సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిదిలో మొబైల్ చెక్ పోస్టు లను ఏర్పాటు చేయడంతో పాటు సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్, నాక బంది వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తూ ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ(AR) భీంరావ్, డిఎస్పీలు రవీంద్ర కుమార్, వెంకటస్వామి, రవీంద్ర రెడ్డి, D.V రంగారెడ్డి ,SB,CCS ఐటీ core ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు, సి.ఐ లు, ఎస్. ఐ లు పాల్గొన్నారు.ఎస్.ఐ లు పాల్గొన్నారు.