👉ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
J.SURENDER KUMAR,
భారత ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను పాటిస్తూ అసెంబ్లి ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.
మంగళవారం బి ఆర్ కే భవన్ నుండి ఎన్నికల పరిశీలకులు అజయ్ వి. నాయక్ , దీపక్ మిశ్రా, ఆర్. బాలకృష్ణ, డిజిపి అంజనీ కుమార్, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి అసెంబ్లి ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన మేర ఈవిఎం యంత్రాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, అవసరమైతే అదనపు బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అందించడం జరుగుతుందని, నవంబర్ 18న రెండవ దశ ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

పెండింగ్ ఓటరు నమోదు దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో పరిష్కరించాలని అన్నారు. ఎన్నికల తనిఖీలలో నగదు, బంగారం, ఇతర ఆభరణాలు జప్తు చేసే సమయంలో ఈ.ఎస్.ఎం.ఎస్ యాప్ లో క్షేత్రస్థాయిలో వెంటనే నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారం సంబంధించిసమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని , ఓటరు స్లిప్పుల పంపిణీ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభించాలని, జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రతిరోజు ఓటర్ స్లిప్పుల పంపిణీ పై సమీక్ష నిర్వహించాలని అన్నారు. గతంలో తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
👉వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ …

సి-విజిల్ ను మరింత పాపులరైజ్ చేయాలని సమయానుకూలంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణపై అందిన ఫిర్యాదులకు స్పష్టమైన సమాచారాన్ని దరఖాస్తుదారునికి అందించాలని అన్నారు. ఎస్.ఎస్.టి., ఎఫ్.ఎస్.టి, ఇతర టీంలకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరిస్తూ అప్ లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్క ఉద్యోగి ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వారికీ ఓటు హక్కు కల్పించేందుకు ఫారం-12 ద్వారా సమాచారాన్ని అందించి నోడల్ అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. అబ్సేంటి ఓటర్లకు 12- D ఫారం ద్వారా ఓటు హక్కు కల్పించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పి సన్ ప్రీత్ సింగ్, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, వివిధ శాఖల అధికారులు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.