ధర్మపురి ఆలయంలో యమ ద్వితీయ ప్రత్యేక పూజలు!

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ”యమద్వితీయ” పర్వదినాన్ని పురస్కరించుకుని అనుబంధ దేవాలయమైన శ్రీయమధర్మరాజు వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్య హోమం, హరతి, మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ముత్యాల శర్మ , పాలెపు ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్, బొజ్జ సంతోష్ కుమార్ , బొజ్జ సంపత్ కుమార్ , బొజ్జ రాజగోపాల్, ప్రదీప్ కుమార్ , మరియు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
కొండగట్టు అంజన్న దర్శించుకున్న నవీన్ మిట్టల్ దంపతులు!


కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామినీ వారి బుధవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ దంపతులు శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంబంతో స్వాగత పలికి స్వామి శేష వస్త్రంతో సత్కరించి వేద పండితుల మరియు ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు.


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని..


ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ దంపతులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అలాగే అనుభంద దేవాలయంలలో గల స్వామివార్లను దర్శించుకున్నారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం అందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు ముత్యాల శర్మ పాలెపు ప్రవీణ్ కుమార్, ముఖ్య అర్చకులు రమణయ్య, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ , రాజగోపాల్, మరియు మెట్పల్లి RDO దూలం మధు, స్థానిక తహశీల్దార్ చైతన్య పాల్గొన్నారు