జగిత్యాల జిల్లాకు పది BSF కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు వచ్చాయి !

👉 ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,

J.SURENDER KUMAR,

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా లో ప్రశాంత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా 10 BSF కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సోమవారం జిల్లా కి రావడం జరిగింది. ఈ సందర్బంగా కేంద్ర బలగాల అధికారులతొ ఎన్నికల సమయo లో నిర్వహించాల్సిన విధుల పై ఎస్పీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ …రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కేంద్రం సాయుధ బలగాలు ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో, రూట్ బందోబస్త్, స్ట్రాంగ్ రూమ్, మరియు మరియు కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుంది అన్నారు. అలాగే చెక్ పోస్ట్ దగ్గర పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లోకల్ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేసి ఎన్నికల విజయవంతం చేయాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు. ఎన్నికల పరంగా మరియు సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పి జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు, చెక్ పోస్ట్ లు, జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి BSF అధికారులకు ఎస్పీ వివరించారు


ఈ సమావేశం లో ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర రావు, BSF అడిషనల్ కమాండెంట్ లియాన్ , BSF అసిస్టెంట్ కమాండెంట్లు SB ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు RI జానీమియా, BSF అధికారులు పాల్గొన్నారు.