జగిత్యాల పోలీస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం !

J.SURENDER KUMAR,

ప్రపంచంలో అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగానికి ప్రపంచ దేశాలతో ఎంతో గుర్తింపు ఉన్నదని మనమంతా రాజ్యాంగ స్పూర్తితో పని చేస్తూ ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలందించాలని జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రభాకర రావు అన్నారు.

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని చెప్పారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా సిబ్బంది చే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో AO అమర్నాథ్, RI జానీమియా, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు కృష్ణ, మల్లేష్, డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.