మంత్రి కేటీఆర్ కు తోటిలో తప్పిన పెను ప్రమాదం !

J.SURENDER KUMAR,

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో గురువారం నిర్వహించిన బీఆర్​ఎన్ నామినేషన్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జీవన్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. పార్టీ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు.

కేటీఆర్‌, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో ప్రచార వాహన డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో కేటీఆర్‌, ఎంపీ సురేశ్‌ రెడ్డి, బీఆర్​ఎస్​ అభ్యర్థి జీవన్‌ రెడ్డి ప్రచార రథం పైనుంచి ముందుకు పడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్​ను కిందపడకుండా పట్టుకున్నారు. ఎంపీ సురేశ్​ రెడ్డి కిందపడ్డారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే…

వాహనం పై భాగంలో అభ్యర్థులు నిలిచి ప్రజలకు అభివాదం చేయడానికి వాహనంపై గ్రిల్స్ తో వెల్డింగ్ చేశారు.  వాహన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహన గ్రిల్‌ ఊడిపోవడంతో నేతలంతా కిందపడబోయారు. ఘటనలో సురేశ్​ రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్​కు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్‌ పట్టణంలోని పాత ఆలూర్‌ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. అనంతరం నామినేషన్‌ వేసేందుకు కేటీఆర్‌, నేతలు వెళ్లారు. తరువాత మంత్రి కేటీఆర్ ఆర్మూర్‌ నుంచి కొడంగల్‌ రోడ్‌ షోలో పాల్గొనేందుకు వెళ్లారు.