న్యాయవాదికి గిన్నిస్​ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం !

👉న్యాయవాద వృత్తిలో   73 సంవత్సరాల 60 రోజులు

J.SURENDER KUMAR,

కేరళకు చెందిన  న్యాయవాది, తన  వృత్తిలో అరుదైన రికార్డును సాధించారు. పాలక్కాడ్​కు చెందిన 97  సంవత్సరాల వయస్సు గల పి.బాలసుబ్రమణియన్​ మేనన్.. అత్యధిక రోజులు న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

సంవత్సరాల 60 రోజులు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించారు. ఈ మేరకు ఆయన రికార్డ్​ను సెప్టెంబర్​ 11న ధ్రువీకరించింది.
గిన్నిస్​ బుక్​ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​. ఇప్పటి వరకు ఈ రికార్డు జిబ్రాల్టర్​ ప్రభుత్వ లాయర్​ లూయిస్​ ట్రియాస్​ పేరున ఉంది. లూయిస్ 70 సంవత్సరాల 311 రోజులు న్యాయవాదిగా పనిచేసి. 94 ఏళ్ల వయసులో మరణించారు.
97 ఏళ్ల వయసున్న మేనన్​.. యువ న్యాయవాదుల తరహా లో తన పనులు  చేసుకుంటున్నారు. కోర్టు, ఆఫీసుకు వెళ్లి వస్తూ, రోజూ అనేక మంది క్లయింట్​లను కలుస్తూ.. న్యాయవాద వృత్తి పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటున్నారు మేనన్. “ఏదైనా కేసు విషయంలో ఓ వ్యక్తి నా వద్దకు వచ్చారంటే.. అతడు నాపైన పూర్తి నమ్మకంతో వస్తారు. అందుకోసమే నా శాయశక్తులా వారికోసం పనిచేస్తాను. కోర్టుల్లో ఎక్కువ వాదోపవాదాలు చేసుకోవడాన్ని నేను నమ్మను. కేవలం మన వాదనను సరిగ్గా చెప్పి.. క్రాస్​ ఎగ్జామినేషన్​ చేస్తాను.” అని బాలసుబ్రమణియన్​ మేనన్ అంటున్నారు.


తమిళనాడు చెన్నైలోని మద్రాస్​ న్యాయ కళాశాలలో లా కోర్స్ పూర్తి చేశారు బాలసుబ్రమణియన్​ మేనన్. అనంతరం 1950లో న్యాయవాద వృత్తిలో చేరి ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఎవరైనా రిటైర్​మెంట్​ ఎప్పుడని ప్రశ్నిస్తే… ఆరోగ్యం సహకరించిన్నని రోజులు.. బాధితులకు తనను కోరుకునే వరకు ఇలానే ప్రాక్టీస్​ చేస్తూనే ఉంటానని చెబుతున్నారు. ఈ రికార్డ్​ కొంతమందిలోనైనా స్ఫూర్తిని నింపాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.