👉36 వేల ఈవీఎంలు సిద్ధం..
👉72,931 బ్యాలెట్ యూనిట్లు..
👉56,592 కంట్రోల్ యూనిట్ల...
👉రాష్ట్రంలో 35,635 పోలింగ్ కేంద్రాలు
👉ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో 18-19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నారని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ అన్నారు.
హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో గురువారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.

వికాస్ రాజ్ మాట్లాడుతూ..
సర్వీస్ ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు ఉపయోగించుకున్నారని తెలిపారు. శాసనసభ ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలు సిద్ధంగా చేశామని చెప్పారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ముద్రించి పంపిణీ చేశామన్నారు.
ఈనెల 30న జరగనున్న పోలింగ్ కోసం 72,931 బ్యాలెట్ యూనిట్లు.. 56,592 కంట్రోల్ యూనిట్లను ఈసీ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
తెలంగాణలో శాసనసభ ఎన్నికల పరిస్థితిని సీఈవో వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా ఓటర్ స్లిప్లను పంపిణీ చేశామని తెలిపారు.

60 మంది వ్యయ పరిశీలకులను
నియమించామని.. మూడు కేటగిరీల వారికి హోం ఓటింగ్ అవకాశం కల్పించాలమని వికాస్రాజ్ పేర్కొన్నారు. ఇప్పటికే 9 వేలకు పైగా ఓటర్లు హోం ఓటింగ్ వేశారన్నారు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ పూర్తి చేశామని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఈసారి ఓటరు స్లిప్తో పాటు ఓటరు గైడ్ బుక్ లెట్ ఇస్తామని చెప్పారు. అందులో ఓటు ఎలా వేయాలనే సమాచారం అలాగే ఫిర్యాదులు ఎలా చేయాలనే సమాచారం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆరు నియోజకవర్గాల్లో 5 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. అభ్యర్థులు ‘సువిధ’ యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారన్నారు. ఓటర్లు ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే సి-విజిల్ యాప్లో చేయొచ్చని సీఈవో వికాస్రాజ్ తెలిపారు. ఓటర్ ఐడెంటీ కార్డులను 51 లక్షల వరకు ప్రింటింగ్ పూర్తి చేశామని.. వాటిని పోస్టల్ శాఖ వారికి ఇచ్చామని వారు పంపిణీ చేయనున్నారని తెలిపారు.
👉కొనసాగుతున్న ఈవీఎంల కమిషనింగ్ 1
శాసనసభ ఎన్నికల కోసం ఈవీఎంలను హైదరాబాద్లోని ఈవీ కాలేజీ డీఆర్సీ కేంద్రంలో ఎన్నికల అధికారులు కమిషనింగ్ చేస్తున్నారు. అభ్యర్థులు, పరిశీలకులు, ఈసీఇఎల్ ఇంజినీర్ల సమక్షంలో ఈవీఎంలు కమిషనింగ్ నిర్వహించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలను పరిశీలించారు. వీవీ ప్యాట్ యంత్రాలను పరిశీలించిన అనంతరం ఎన్నికల సిబ్బంది సీల్ వేయనున్నారు.
ఈనెల 30న జరగనున్న పోలింగ్ కోసం 72,931 బ్యాలెట్ యూనిట్లు.. 56,592 కంట్రోల్ యూనిట్లను ఈసీ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.