👉టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి!
J. SURENDER KUMAR,
బీజేపీ మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ లోని రాహుల్ గాంధీ బస చేసిన
నోవాటెల్ హోటల్లో బుధవారం మాజీ ఎంపీ డాక్టర్ వివేక్, ఆయన తనయుడు వంశీ రాహుల్ గాంధీ వారికి కండువా కప్పగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వివేక్ లు మీడియాతో మాట్లాడారు.
గాంధీ కుటుంబంతో వివేక్ కుటుంబానికి దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు అనుబంధాలు ఉన్నాయని, రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి 11 గంటల 20 నిమిషాలకు రాజీనామా లేఖను పంపించారు. బాధతో బీజేపీ పార్టీని వీడుతన్నట్లు ఆయన లేఖలో ప్రస్తావించారు.

ఇటీవల వివేక్ రేవంత్ రెడ్డిని కలిసి చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా, పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వివేక్ క్లారిటీ ఇచ్చారు. అలాగే వివేక్ కుమారుడిని చెన్నూరు నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వివేక్ వెంకటస్వామి అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు బీజేపీ నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం కూడా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు వివేక్ వెంకటస్వామి కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అయితే ఈ ప్రచారాన్ని వివేక్ వెంకటస్వామి గత నెల 24న ఖండించారు. తాను పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో చేరిక చాలా కాలమని గుర్తు చేశారు. 2009లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన వివేక్ వెంకటస్వామి.. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి బీఆర్ ఎస్ లో చేరారు. కొంతకాలం బీఆర్ఎస్లో కొనసాగారు. వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. కొందరు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గద్దె దించే సత్తా బీజేపీకి ఉందని అప్పట్లో ఆ నేతలు చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండి సంజయ్ ను తప్పించాలని కొందరు పార్టీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కొందరు బండి సంజయ్ కు అనుకూలంగా వ్యవహరించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఈ పరిణామంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బండి సంజయ్ ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం వల్ల పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయంతో నేతలు కూడా ఉన్నారు. ఈ పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్ బై చెప్పారు. అయితే.. సరిగ్గా ఎన్నికల వేళ కీలక నేత పార్టీకి హ్యాండ్ ఇవ్వడం బీజేపీ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని చర్చ కొనసాగుతున్నది