పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
గత ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకొని ప్రజలను మద్యానికి ప్రియులుగా, బానిసలుగా చేసిందని, ప్రతి గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి వాటిని తక్షణమే తొలగించాలని, పట్టభద్రులుఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో గురువారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బెల్ట్ షాపులు తొలగింపు సంబంధించిన ఆదేశాలు జారీ చేయాలని సీఎం రేవంత్కు లేఖ రాసినట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలోని గ్రామాల్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను గత ప్రభుత్వానికి ఎక్సైజ్శాఖ ఆదాయ శాఖగా మారిందని ఆరోపించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ నియంతృత్వ ధోరణిలో పాలన కొనసాగిందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ లక్షణాలను నీరు కార్చారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. అందుకే ప్రజలు మార్పు రావాలని కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో సీట్లు కోల్పోతామని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీని కొనసాగించడం, మహిళలకు ఆర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు లబ్ధి చేకూరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తొలగించాలనడం హర్షనీయమన్నారు. ముఖ్యమంత్రి శ్వేత పత్రం రిలీజ్ చేస్తే బీఆర్ఎస్లో వణుకు పుడుతుందని అందుకే బీఆర్ఎస్ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. దళితబంధు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం మాత్రమే వచ్చిందని దళితులు గ్రహించారని జీవన్ రెడ్డి అన్నరు.
ఈసారి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని చెప్పారు. హుస్నాబాద్ను తిరిగి కరీంనగర్లో కలపాలన్న డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం అవుతుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని జోస్యం చెప్పారు.