నవంబర్ లో రెండు వేల రెండు వందల కోట్ల మద్యం అమ్మకాలు !

👉నేటి నుంచే కొత్త ఎక్సైజ్ పాలసీ !

J.SURENDER KUMAR,

గత నవంబర్‌ మాసంలో దాదాపు ₹ 2,200 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నెలాఖరులోగా పాత స్టాక్‌ను క్లియర్‌ చేశారు. ఒక్క నెలలోనే 21.69 లక్షల లిక్కర్ కేసులు, 30.44 లక్షల కేస్ల బీర్లు సేల్ అయ్యాయి.

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బీర్లను విపరీతంగా తాగారు. ప్రజలు, ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలు, నాయకులు , ఛీప్ లిక్కర్ పై ఇంట్రస్ట్ చూపలేదని తెలుస్తోంది. మద్యం ప్రియులు మినిమం బ్రాండ్ నే మెయింటైన్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఆయా రాజకీయ పార్టీల విందులలో రాయల్ స్టాగ్, బ్లెండర్స్ ప్రైడ్ , వంటి బ్రాండ్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో ఛీప్ లిక్కర్ తక్కువగా అమ్ముడు పోయినట్లుగా ఆ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.

నేటి నుంచే కొత్త ఎక్సైజ్ పాలసీ !


రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్ షాపుల లైసెన్సు గడువు నవంబర్ 30వ తేదీతో ముగిసింది. ముందస్తుగా ఆగస్టు నెలలో నిర్వహించిన టెండర్లలో వైన్ షాపుల లైసెన్స్ లు దక్కించుకున్నవారు డిసెంబర్‌ 1 నుంచి రెండేండ్ల పాటు మద్యం దుకాణాలను నిర్వహించనున్నారు. వైన్ షాపుల టెండర్లకు ఆగస్ట్ లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2,620 వైన్స్ లకు 1,31,490 అప్లికేషన్లు వచ్చాయి.
సర్కార్కు దరఖాస్తుల ద్వారానే ₹ 2,629 కోట్ల ఆదాయం వచ్చింది.