ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు!

👉 సీఎం ఓ కార్యాలయ ప్రకటన లో..

J. SURENDER KUMAR,

సీఎం రేవంత్ రెడ్డి తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమయ్యారు.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి పాల్గొన్నారు.