ఆలయాల్లో ఆన్లైన్ టెండర్ ద్వారా సరుకుల కొనుగోలుకు ప్రత్యేక జీవో ఉందా ?

👉తెలంగాణ ఏర్పడిన 46 రోజులకే సర్కులర్ జారీ!

👉ఉమ్మడి రాష్ట్ర నివేదికలు అడ్డుపెట్టుకొని సరుకుల కొనుగోలుకు సర్కులర్


   👉      (పార్ట్ – 2 )


      J.SURENDER KUMAR,

తెలంగాణలోని ప్రముఖ ఆలయాల ఆదాయం కొందరు అధికారుల, వ్యాపారి పాలిట కామధేనువుగా మారింది.  ఆలయాలలో  సరుకుల కొనుగోలుకు ప్రత్యేక జీవో లేకున్నా, ఉమ్మడి రాష్ట్రంలోని నివేదికల ఆధారంగా జారీ అయినా  సర్కులర్ ద్వారానే  కొనుగోలు చేస్తున్నారు, రాష్ట్రం ఏర్పడిన 46 రోజులలో దేవాదాయ శాఖ  జారీ చేసిన సర్కులర్ ద్వారా గత పది సంవత్సరాల గా ఆన్లైన్ టెండర్ నిబంధనలు అడ్డుపెట్టుకొని సరుకులకు అడ్డగోలుగా, అధిక ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తూ, కోట్లాది రూపాయలు ఆలయాల ఆదాయంకు అధికారులు గండి కొడుతున్నారనేది జగమెరిగిన సత్యం.


రాష్ట్ర ఏర్పాటైన 46 రోజులకే సర్కులర్ !


దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఏర్పడిన 46 రోజులకే సరుకుల కొనుగోలు విధి విధానాలపై  2014, జులై 18 న, సర్కులర్ నెంబర్ అర్, సి.No. E 2/10825/2014. జారీ చేశారు.
విజిలెన్స్ నివేదికల ఆధారంగా!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ నివేదిక No.11(C.No.1104/ V&E/D4/10). తేదీ 30-1-2013 నాటి నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ లేఖ సంఖ్య. ఆర్.సి.No,A4/37487/2013, తేదీ 31-12-2 013న జారీ చేసిన నియమ నిబంధనలో మేరకు సరుకులు కొనుగోలు చేయాలని ఆలయాల కార్య నిర్వహణాధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.
వ్యాపారులకు షాక్ ఇస్తున్న నిబంధనలు!
పట్టణాలలో, జిల్లా కేంద్రాల్లో, కిరాణం హోల్ సేల్ వ్యాపారస్తులకు టెండర్ లోని నిబంధనలు  షాక్ ఇస్తున్నాయి.  ఆ సర్కులర్ నిబంధనలు హైదరాబాదులోని రెండు, మూడు వ్యాపార సంస్థలకే ఉన్నట్టుగా, గత కొన్ని సంవత్సరాలుగా వారే టెండర్ లో పాల్గొంటూ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు సరుకులు సప్లై చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.
సర్కులర్ లోటెండర్ నిబంధనలు ఇలా

ఆర్థిక సంవత్సర కాలం కు సరుకుల సప్లై కి ఒక్కటే టెండర్ !

ఆలయాలలో స్వామివారికి నిత్య నివేదన,  ప్రసాదాల తయారీ, అన్నదానం, పూజాది కార్యక్రమాల పూజా సామాగ్రి, పారిశుద్ధ్య నిర్వహణ  కెమికల్స్, బ్లీచింగ్ పౌడర్ లాంటివి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసే ఆకు దొప్పలు, విస్తరి ఆకులు, స్వామివారికి మామిడి తోరణాలు కట్టే  సుత్తిలి దారం, మొదలుకొని విద్యుత్తు వైర్లు, బల్బులు, పరికరాలు, సప్లై కోసం టెండర్ లలో అధికారులు ఆలయాల అవసరాల మేరకు సప్లై లో దాదాపు 100 అంశాల వివరాలు పేర్కొంటున్నారు అని సమాచారం.
సంవత్సర కాలానికి సరుకులు సప్లై చేసే టెండర్ సొంతం చేసుకున్న వ్యాపారుడి , వ్యాపార సంస్థ పేరు, ఒప్పందం జరిగిన సరుకుల ధరలు, సరుకుల నమూనా ( శాంపిల్స్) సమాచారం (సంవత్సర కాలం పాటు టెండర్ ఒప్పందం మేరకు పేర్కొన్న  నాణ్యత ప్రమాణాలు. గల  సరుకుల సప్లై చేస్తానంటూ.
టెండర్ పొందిన వ్యాపారి, ఆలయంలో తనిఖీల కోసం ఇచ్చే నిలువ నమూనా సరుకులు ( శాంపుల్ ప్యాకెట్లు)  ఆలయాల పాలకవర్గానికి  అర్చకులకు, భక్తజనంకు, (పాలకవర్గం లేని చోటు) ఉద్యోగులకు వాటి  వివరాలు తెలియకుండానే  ఆలయ అధికారుల సరుకుల కొనుగోలు తతంగం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ఆలయానికి సంవత్సర కాలం పాటు అవసరం మేరకు ప్రతి నెల కొనుగోలు చేస్తున్న సరుకుల వివరాలు గాని, ఆలయ నిధులనుండి కొనుగోలు చేసిన సరుకులకు వ్యాపారికి చెల్లిస్తున్న మొత్తం వివరాలు ఆలయ అధికారికి, వ్యాపారికే  తెలిసి ఉంటుంది తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. ఒక్క ధర్మపురి ఆలయం లో నిత్య నివేదన అన్నదానం పూజా సామాగ్రి తదితర సరుకులు కొనుగోలుకు  ప్రతినెల దాదాపు ₹ 25 లక్షల రూపాయలు చెల్లిస్తుంటారు. బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు,పండుగలకు మినహించి ఈ చెల్లింపు ఉంటుంది, ఈ లెక్కన కొండగట్టు, వేములవాడ, యాదాద్రి, భద్రాచలం, బాసర తదితర ప్రముఖ ఆలయాలలో సరుకుల కొనుగోలు కోసం ప్రతి నెల దాదాపు ,₹30, 40, లక్షల రూపాయల వ్యాపారికి చెల్లిస్తుంటారు.

త్వరలో పార్ట్ -3
(నాణ్యత ప్రమాణాలు, లేని నాసిరకం సరుకుల, సప్లై తీరు తెన్నులు, నిబంధనలకు తిలోదకాల వివరాలు త్వరలో).