ధర్మపురి నరసింహుడి దర్శించుకున్న ఏపీ ప్రభుత్వ కార్యదర్శి !

J. SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణి మోహన్, మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ దర్శించుకున్నారు.

తదనంతరం శ్రీ స్వామివారి నిత్య కళ్యాణంలొ ఆమె పాల్గొన్నారు. వీరికి ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందించి సన్మానించారు.


ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, రమణయ్య , సూపరింటెండెంట్ కిరణ్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.