ఇద్దరు ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయుడు కాల్చి చంపాడు !

J.SURENDER KUMAR,
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన సహచర ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలలోనే తుపాకితో కాల్చి చంపిన సంఘటన ఝార్ఖండ్ లో మంగళవారం జరిగింది.

అనంతరం తనను తాను కాల్చుకోవడానికి యత్నించగా తీవ్రంగా గాయపడ్డాడు. ఝార్ఖండ్​లోని గొడ్డా జిల్లాలో ఎస్పీ నాథూ సింగ్ మీనా కథనం మేరకు.. రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని పోరైయాహత్ ప్రాంతంలోని అప్‌గ్రేడెడ్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముగ్గురు టీచర్లు పనిచేస్తున్నారు.  మంగళవారం ఉదయం స్కూల్​కు వచ్చిన వేరు పాఠశాల గదులలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు .

గాయపడిన ఉపాధ్యాయుడు తనతో తెచ్చుకున్న తుపాకీతో తన తోటి ఉపాధ్యాయులను  కాల్చిచంపినట్లుగా ఎస్పీ నాథ్ సింగ్ మీనా తెలిపారు. మృతుల్లో మహిళ ఉపాధ్యాయురాలు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. అనంతరం అదే తుపాకీతో నిందితుడు కాల్చుకోగా, తీవ్రంగా గాయపడినట్లుగా  ఎస్​పీ నాథు సింగ్​ మీనా మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.