👉 లేటు గెలుపు అయినా.. అది లేటెస్ట్ గెలుపే !
👉 నాడు మాజీ మంత్రి పై.. నేడు సిట్టింగ్ మంత్రి పై గెలుపు!
👉 కాంగ్రెస్ పార్టీని వీడలేదు ..నియోజకవర్గం వదలలేదు
👉 ఎమ్మెల్యేగా లక్ష్మణ్ కుమార్ గెలిచి నేటికీ నెల రోజులు!
J.SURENDER KUMAR,
ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లేటుగా గెలిచినా, ఆయన గెలుపు లేటెస్ట్ చర్చగా మారింది. ఇందుకు కారణం లక్ష్మణ్ కుమార్, ఎప్పుడు ప్రజాక్షేత్రంలో విజయం సాధించినా , ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండటమే చర్చకు కారణం. లక్ష్మణ్ కుమార్ ప్రజా ప్రతినిధిగా గెలిచిన ప్రతిసారి పదవులు ఆయన పంచన చేరుతున్నాయి.
వివరాల్లోకి వెళితే…
2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ధర్మారం జడ్పిటిసి సభ్యుడి పదవికి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి మాజీ మంత్రి మాతంగి నరసయ్య, (టిడిపి) ఆయన పై లక్ష్మణ్ కుమార్, దాదాపు 3 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత సంవత్సరం డిసెంబర్ 3న వెల్లడించారు. ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా , లక్ష్మణ్ కుమార్, ప్రత్యర్థి ఉన్న సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలిసిన విషయమే
ఎన్నికల్లో నాడు మాజీ మంత్రిని, నేడు సిట్టింగ్ మంత్రి ఓడించిన, చరిత్ర లక్ష్మణ్ కుమార్ రాజకీయ చరిత్ర రికార్డులో నమోదయింది. రాజకీయ కారణాల నేపథ్యంలో నాడు 2010 నుంచి 2012 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా లక్ష్మణ్ కుమార్ కొనసాగారు. చైర్మన్ పదవి కాలం అనంతరం, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా (క్యాబినెట్ హోదా) 2014 వరకు కొనసాగారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ను, ప్రభుత్వ విప్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించి అదనపు భద్రతను కల్పిస్తూ, ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చారు.
కాంగ్రెస్ పార్టీని విడలేదు.. నియోజకవర్గం వదలలేదు !

1982-85 లో (NSUI)కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, 1986- 94 వరకు NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, 194-96 జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 1996-2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా లక్ష్మణ్ కుమార్ కొనసాగారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1365 స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా ధర్మపురి అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండుసార్లు పోటీ చేసి. లక్ష్మణ్ కుమార్ ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి 441 స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. ,2019 నుంచి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ కొనసాగుతున్నారు. ధర్మపురి అసెంబ్లీ కి పలుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడినా, లక్ష్మణ్ కుమార్ నియోజకవర్గాన్ని వీడిపోలేదు. అనేక ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, విద్యుత్తు రైతుల ధాన్యంలో తరుగు, వెలగటూరు మండలంలో ఇథ్ నల్ పరిశ్రమ ఏర్పాటు వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటాలు, తదితరులు కార్యక్రమాలలో ప్రజలతో మమేకము. ఆయన రాజీలేని పోరాటాలు చేస్తూ, కాంగ్రెస్ క్యాడర్ ను కాపాడుకుంటూ 2023 ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి నేటికీ నెల రోజులు .