నాసిరకం సరుకులతో దేవుళ్లకు నైవేద్యాలుభక్తులకు ప్రసాదాలు !

👉 డిప్యూటీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలలో వెలుగు చూసిన వైనం !


    👉 ( పార్ట్ – 3 )

J.SURENDER KUMAR,

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో దేవుళ్లకు నాసిరకం సరుకులతో నైవేద్యాలు, భక్తులకు ప్రసాదాలు అందుతున్న దుర్భర దుస్థితి నెలకొందనే ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆలయాలకు సరుకులు కొనుగోలు తీరు తెన్నులు పరిశీలిస్తే నాణ్యత ప్రమాణాలు గల సరుకుల సరఫరా స్థానంలో, నాసిరకం సరుకులు సప్లై అవకాశాలు అధికంగా ఉందనే చర్చకు అవకాశం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా గత సంవత్సరం అక్టోబర్ లో వరంగల్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ధర్మపురి ఆలయం లోని సరుకుల గోదామును, ఆలయ రికార్డులను అధికారులను ఆకస్మిక తనిఖీ చేయడంతో  లక్షలాది రూపాయలు విలువగల సరుకులు అధికంగా ఉండడం. దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే సరుకులు తక్కువ ఉండడంతో డిప్యూటీ కమిషనర్ ఆలయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వివరాలను రికార్డులో నమోదు చేసినట్టు సమాచారం ప్రత్యేకంగా ప్రసాదలు, అన్నదానం వినియోగంలో నాణ్యత ప్రమాణాలు లేని నాసిరకం సరుకుల అంశం ఆయన తనిఖీలు వెలుగు చూసినట్టు సమాచారం. భక్తజనంకు విక్రయించే లడ్డు, పులిహోర  ప్రసాదాలలో నాణ్యత ప్రమాణాలు లేవని రికార్డులలో అధికారి స్పష్టంగా నమోదు చేసినట్టు సమాచారం.

👉 ప్రసాదాల తయారీలో చేతివాటం !

దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల గల సరుకుల వినియోగించాల్సిన వివరాలు ఇలా ఉన్నాయి.

👉 100 కిలోల శనగపిండితో లడ్డు తయారీలో వాడాల్సిన సరుకులు !

100 కిలోల శనగపిండి, 2 క్వింటాళ్ల పంచదార, 5 కిలో మిస్రీ
5 కిలో కిస్మిస్, 7.500 కిలో ఖాజు, (డబుల్ సైజు) 75 కిలోల బ్రాండెడ్ నెయ్యి, 1 కిలోల యాలకుల పొడి, 100 గ్రాములు జాజికాయ, 100 గ్రాముల పచ్చ కర్పూరం. వినియోగించాల్సి ఉంటుంది.
వీటి తయారీకి నిబంధనల మేరకు రెండు గ్యాస్ సిలిండర్లు వినియోగించాల్సి ఉంటుంది.

👉.పులిహోర 100 కిలోల తయారీకి !

100 కిలోల బిపిటి పాత బియ్యం, 5 కిలో శనగపప్పు, అర్ధ కిలో మినప్పప్పు, 5 కిలో పల్లీలు, 0.500 గ్రాముల పసుపు, 20 కిలోల నూనె, 20 కిలోల చింతపండు, 1 కిలో  ఎండుమిర్చి, కిలో ఉప్పు, 100 గ్రాముల జిలకర, 1 కిలోలఆవాలు, 0.50 గ్రాముల మెంతులు, 1 కిలో  మిరియాలు, 0.040 గ్రాముల ఇంగువ, వినియోగించాల్సి ఉంటుంది.
👉.ప్రసాదం లడ్డు బరువు ,80 గ్రాములు. పులిహోర ప్యాకెట్ 200 గ్రాములు ఉండాలి.!

ప్రసాదాలను ఫుడ్ ఇన్స్పెక్టర్ , కల్తీ నిరోధక శాఖ అధికారులు గాని తనిఖీ సందర్భంలోనే ఇందులో వినియోగించిన సరుకులు వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అలాంటి తనిఖీలు జరిగిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు కానీ గత సంవత్సరం అక్టోబర్లో డిప్యూటీ కమిషనర్ తనిఖీల్లో నాసిరకం సరుకులతో నైవేద్యం, ప్రసాదాలు లడ్డు, పులిహోర, భక్తులకు ఉచిత అన్నదానం తయారు చేస్తున్నారని విషయం వెలుగు చూసినట్టు సమాచారం.
సరుకులు కొనుగోలు,వినియోగం వివరాలు ప్రతిరోజు రిజిస్టర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.
15 రోజులకు ఓసారి రిజిస్టర్ తనిఖీ చేసి ఆలయ కార్యనిర్వాణాధికారి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అయితే గత సంవత్సరం ఆగస్టు మాసం నుంచి డిప్యూటీ కమిషనర్ తనిఖీ చేసే రోజు నాటి వరకు కూడా కార్య నిర్వహణ అధికారి రికార్డు ల ను తనిఖీ చేసినట్టు, పర్యవేక్షణ సంతకాలు చేసినట్టు లేవని. తనిఖీ అధికారి రికార్డులలో నమోదు చేసినట్లు సమాచారం.

👉వివరాలు లోకి వెళ్తే
ఆలయాలలో దేవుళ్లకు నిత్య నైవేద్యాలు, ప్రసాదాల అమ్మకాలు, భక్తులకు ఉచిత అన్నదానం తయారీకి సంవత్సర కాలం పాటు నిత్యవసర సరుకులను టెండర్ ద్వారా కొనుగోలు చేస్తుంటారు.
టెండర్ ప్రకటనలో బ్రాండెడ్ కంపెనీల సరుకులు మాత్రమే సప్లై చేయాలని, ఆయా సరుకుల బ్రాండ్ లు పేర్కొంటూ, టెండర్ లో ప్రకటిస్తారు. టెండర్ కైవసం చేసుకున్నవారు అవే సరుకులను సప్లై చేయాల్సి ఉంటుంది.

👉 టెండర్ ప్రకటనలో పేర్కొన్న విధంగా కొనుగోలు చేయాల్సిన బ్రాండెడ్ సరుకుల వివరాలు కొన్ని ఇవి ….

1). ఖజు (JH బ్రాండ్ రెండు పీసులుకలపి ఉన్నది). 2) కారం పొడి (ఆశీర్వాద్ బ్రాండ్) 3) పసుపు (స్వస్తిక్ బ్రాండ్) 4) ఉప్పు (అన్నపూర్ణ బ్రాండ్) 5) గోధుమపిండి (అన్నపూర్ణ బ్రాండ్) 6) టీ పొడి (జెమినీ బ్రాండ్) 7) హారతి కర్పూరం (స్వస్తిక్ బ్రాండ్) 8) తేనె (నెంబర్ వన్ గిరిజన బ్రాండ్) 9) నూనె (గోల్డ్ డ్రాప్ బ్రాండెడ్) 10) కుంకుమ (నోము బ్రాండెడ్) 11) అగర్బత్తులు ( పద్మిని బ్రాండెడ్) 12) పంచదార .(బోధన్ లేదా. గాయత్రి బ్రాండెడ్) 13) శనగపప్పు (క్యామెల్ బ్రాండ్).14) బియ్యం ( ఓల్డ్ బిపిటి బ్రాండ్) 15) చీపురు (బొంబాయి బ్రాండ్).16) బ్లీచింగ్ పౌడర్ (శ్రీకృష్ణ కంపెనీ బ్రాండ్) 17) యాసిడ్ (MEPL బ్రాండ్) 18) సెంటెడ్ ఫినాయిల్ ( Pedilite Mr .Perfect బ్రాండెడ్) లతో పాటు విద్యుత్ పరికరాలు( ఫిలిప్స్ కంపెనీ, నాకొడ బ్రాండ్ వైర్లు) కలుపుకొని దాదాపు 100 కు పైగా వస్తువులు ఆయా కంపెనీల బ్రాండ్ లు పేర్కొంటూ సరుకుల సరఫరా చేయాలని టెండర్ ప్రకటనలో పేర్కొంటారు.

👉 నాసిరకం సరుకుల సరఫరా, వినియోగం ఇలా చేస్తారు !

నెల రోజులకు సరిపడే సరుకుల వివరాలు పేర్కొంటూ సరఫరాదారుడికి మెయిల్, లేదా వాట్సప్ లో సరుకుల వివరాలు క్వాంటిటీ, లిస్టు పంపిస్తారు . హైదరాబాదు నుండి ఆలయ గోదాములలోకి చేరిన సరుకుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించే వారు ఉండరు. కేవలం దిట్టం నిర్వహించే ఉద్యోగి,. కార్యనిర్వహణాధికారికి, సప్లై చేసేవారికి. మాత్రమే సరుకుల క్వాలిటీ వివరాలు తెలిసే అవకాశం ఉంది. వీరి ముగ్గురి వద్ద లావాదేవీలు వివరాలు ఉంటాయి.

👉నాసిరకం సరుకుల వినియోగం ఇలా !

ఉదాహరణకు, గోల్డ్ డ్రాప్ ఆయిల్ స్థానంలో, పామాయిల్ లేదా మామూలు నూనె, ఖజు J.H బ్రాండ్ , రెండు పీసులు కలిపి ఉన్న కాజుకు బదులు, కాజు పలుకులు,. యాలకులు, ఆకుపచ్చ నెంబర్ వన్ కు బదులు సెకండ్ క్వాలిటీ, పసుపు, స్వస్తిక్ బ్రాండ్ కు బదులు సెకండ్ క్వాలిటీ. తదితర నాసిరకం) సరుకులు సప్లై దారుడు చేస్తారు. స్వామివారికి నైవేద్యం, భక్తులకు ప్రసాదాల, ఉచిత అన్నదానం కోసం. ఈ సరుకులనే వినియోగిస్తారు.
👉 సరుకులసప్లై దారుడికి మాత్రం బ్రాండెడ్ సరుకుల కొనుగోలు ధరలు చెల్లిస్తూ, కొందరు అధికారులు సప్లైదారు నుంచి నెల నెల వేలాది రూపాయల కమిషన్ తీసుకుంటారు అనే ఆరోపణలు ఉన్నాయి.
👉ఈ లెక్కన ప్రతినెల ఒక్కొక్క ఆలయం కనీసం ₹ 3 లక్షల రూపాయల నుండి ₹5 లక్షల రూపాయల మేర బ్రాండెడ్ సరుకులు కొనుగోలు చేసినట్టు సప్లైదారుడికి వాటి ధరల ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంటారు. దీంతో ఆలయ ఆదాయానికి గండి పడుతుందనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.
👉ఇదిలా ఉండగా ‘ధిట్టం’  ( సరుకుల నిలువలగోదాం)  పర్యవేక్షించే ఉద్యోగి ప్రతి నెల ఆలయ అధికారికి, తప్పనిసరిగా ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఆ మొత్తం చెల్లించిన వారికే అక్కడ డ్యూటీలు కేటాయిస్తారని ఆలయ ఉద్యోగులు అనేకమంది ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.
సరుకులు కొనుగోలు,వినియోగం వివరాలు ప్రతిరోజు రిజిస్టర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.