👉రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
స్వేచ్ఛా, స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవాలని అన్నారు.
ప్రజల పోరాటంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉంటుందని అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే తమ ప్రభుత్వం ప్రజా పాలనకు శ్రీకారం చుట్టిందని, ప్రజలే పాలకులనే జవాబుదారీతనంతో పని చేస్తుందని అన్నారు.
నియంత పోకడలను పాతర పెట్టి, రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణానికి సిద్ధపడిందన్నారు.
సీఎం నివాసంలో…

గణతంత్రదినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపరేడ్ గ్రౌండ్ లో…


సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక్ స్మారక్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన త్రివిధ దళాలు.

గణ తంత్రదినోత్సవం సందర్భంగా వీరుల సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు సీఎం నివాళి అర్పించారు..
పబ్లిక్ గార్డెన్ లో…

గణ తంత్రదినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు.
పరామర్శ..

ఇటీవల అనారోగ్యానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.

గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు