👉నెలరోజుల పాలన పై ఎక్స్ వేదికగా వెల్లడి
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
నెలరోజుల పాలన నిజాయతీగా సాగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ, గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా మరింత బాధ్యతగా ముందుకు సాగుతానని రేవంత్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన తన నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలు రేవంతన్నగా తనను గుండెల్లో పెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా బాధ్యతను నిర్వర్తిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి X లొ పేర్కొన్నారు.
పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు సాగామన్నారు. అన్నగా నేనున్నానని ప్రజలకు హామీ ఇస్తూ, జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందంటూ రేవంత్రెడ్డి వివరించారు.

పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ నడిచామని రేవంత్రెడ్డి తెలిపారు. మహాలక్ష్మీల ముఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు కొనసాగుతోందన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీఠ వేస్తామన్న ముఖ్యమంత్రి, పెట్టుబడులకు కట్టుబడి ఉంటామని మరోమారు చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పారు.
సింపుల్గా, స్మూత్గా, ఫాస్ట్గా ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో ప్రజలకు మరింత దగ్గర ఎలా అవ్వాలో తెలిసిన నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే కేవలం నెల రోజుల పాలనలోనే తన మార్క్ ఏంటో చూపించుకోగలిగారు. పాలకులం కాదు, సేవకులం అంటూ ప్రమాణ స్వీకారం రోజే సరికొత్తగా ప్రజల్ని ఆకట్టుకున్నారు.
సీనియర్ మంత్రులను కలుపుకొని వెళ్తూ, ఆరు గ్యారెంటీల అమలుపై దూకుడు చూపుతూ పాలనలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో పదేళ్లుగా గత ప్రభుత్వం చేసిన తప్పులను రిపీట్ కాకుండా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రతి పైసాను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
వస్తూనే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఖజానాను ఖాళీ చేసిన పరిస్థితిని తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా వివరించడంతో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేసింది. అయితే వీటిని తిప్పి కొడుతూ, గ్యారెంటీ హామీలు వంద రోజుల్లో కచ్చితంగా అమలు అవుతాయన్న భరోసా ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ సఫలమైంది అని చెప్పవచ్చు.
ప్రగతి భవన్ బారికేడ్లు ధ్వంసం!
ఓవైపు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తూనే, ఇంకోవైపు ప్రగతిభవన్ బారికేడ్లు గోడలు బద్దలు కొట్టించారు రేవంత్ రెడ్డి. ప్రజా పాలనకు, స్వేచ్ఛకు అదొక సూచికగా మార్చేశారనే చెప్పాలి. అప్పటి వరకు పెద్ద గోడలు, ఫెన్సింగ్లు, ఇనుప కంచెలతో ఉన్న ప్రగతిభవన్ను ప్రజలకు అంకితం చేశారు. దానిని కాస్తా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా, మార్చేశారు. ఇక అక్కడి నుంచి మొదలు రూట్ మారింది. స్పీడ్ పెరిగింది. తొలి సంతకం ఆరు గ్యారెంటీల అమలు, అలాగే గతంలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చారు.