తిరుమల తిరుపతి లో 14న భోగి తేరు !

👉జనవరి 16న గోదాకళ్యాణం

J.SURENDER KUMAR
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి జనవరి 14న భోగి తేరు, జనవరి 15న మకర సంక్రాంతి ఉత్సవాలునిర్వహించనున్నారు.అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో పేర్కొంది.

వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 14న భోగి పండుగ సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణ స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు..జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా ఉదయం సంక్రాంతి తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 6.30 గంటలకు ఆలయం నుంచి చక్రతాళ్వార్‌ను ఊరేగింపుగా కపిలతీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థానికి తీసుకువెళ్లారు. సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామిని మాడ వీధుల్లో ఊరేగిస్తారు. జనవరి 16వ తేదీ ఉదయం శ్రీ పుండరీకావల్లి అమ్మవారు ఆలయం నుంచి మేల్చాట్ వస్త్రం, పూలమాలలను ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మవారికి సమర్పిస్తారు. శ్రీ ఆండాళ్ అమ్మవారు కపిల తీర్థంలోని శ్రీ ఆళ్వార్ తీర్థంలో పూజలందుకుంటున్నారు. అక్కడ తిరుమంజనం అనంతరం ఏకాంతంగా ఆలయానికి చేరుకుంటారు
.

ఆలయంలో సాయంత్రం 4 గంటల నుంచి 6.30 గంటల మధ్య శ్రీ గోదాకల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. అదేవిధంగా జనవరి 17న పార్వేట ఉత్సవం జరుగుతుందని, ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజ స్వామిని ఆలయం నుంచి సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య రేణిగుంట రోడ్డులో ఉన్న పార్వేట మండపం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.