అజాత శత్రువు శ్రీపాదరావుకు అరుదైన అధికారిక గౌరవం !

👉శ్రీపాదరావు జయంతి మార్చి 2 స్టేట్ ఫంక్షన్..

👉జీవో జారీ చేసిన ప్రభుత్వం..

J.SURENDER KUMAR,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్ధిల్ల శ్రీపాదరావు కు స్వరాష్ట్రంలో అరుదైన అధికారిక గౌరవం దక్కింది. శ్రీపాదరావు జయంతిని మార్చి 2 న స్టేట్ ఫంక్షన్ గా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం శనివారం జీవో నెంబర్ 295 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.


భూపాల్ పల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో 1935 మర్చి 2 న మౌళి పటేల్ రాధాకృష్ణయ్య కమల భాయ్ దంపతులకు శ్రీపాదరావు జన్మించారు. నాగపూర్ లో న్యాయ విద్యనభ్యసించారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం లో 1983 నుంచి వరుసగా మూడుసార్లు మంథని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

దట్టమైన కి కారణ్యం , పీపుల్స్ వార్ నక్సల్స్ ప్రాబల్యం గల. మంథని నియోజకవర్గంలో. సాగు, తాగు నీటి సమస్యలతో పాటు విద్యా, వైద్య సదుపాయలు, రహదారుల అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన కోసం పట్టు పురుగుల పెంపక కేంద్రం తదితర అభివృద్ధి పనులు నక్సల్స్ ప్రాంతంలో చేపట్టిన ఘనత శ్రీపాదరావు ది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో..

రెండుసార్లు ధన్వాడ సర్పంచ్ గా మహాదేవపూర్ సమితి బ్లాక్ ఉపాధ్యక్షుడిగా, ఎల్ఎంబి చైర్మన్ గా నిరంతరం ప్రజాక్షేత్రంలో మమైకమైన 1983 లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలోనూ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి. పీవీ నరసింహారావు తో కుటుంబ పరంగా రాజకీయంగా స్నేహ సంబంధాలు ఉన్నాయి

. ఆధునిక వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పట్ల ఈ ప్రాంత రైతాంగాన్ని చైతన్య పరచడం కోసం శ్రీపాదనలేని కృషి చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలు శ్రీపాదరావు ను ‘ బుచ్చి పంతులు’ అని ప్రేమగా పిలుస్తారు..

రాజకీయ పరంగా శ్రీపాదరావును వ్యతిరేకించే వారిని సైతం ఆయన పలకరించేవారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కనీసం పదిమందిని పేరుపేరునా పిలిచే సంబంధాలు కలిగి ఉన్న శ్రీపాదరావు. అజాతశత్రువుగా గుర్తింపు పొందారు.


మహాదేవపూర్ మండలం అటవీ గ్రామమైన అన్నారంలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో ఓ కార్యక్రమనికి 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు అడవి మార్గం గుండా వెళ్లారు. ఆ దారిలో వార్ నక్సలైట్లు శ్రీపాదరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ‘మా సమస్యల గురించి మీతో మాట్లాడాలి’ మాతో మీరు ఒంటరిగా రావాలని శ్రీపాదరావు నక్సలైట్లు కోరారు.

ఆయన వెంట ఉన్న అనుచరులను మీరు రావద్దని ఆదేశించారు. అనేక సందర్భాల్లో పలువురు వార్ సానుభూతిపరుల ను, మిలిటెంట్లను పోలీస్ స్టేషన్, కేసుల నుంచి, శ్రీపాదరావు విడిపించారు. ఈ నేపథ్యంలో సార్ తో నక్సల్స్ మాట్లాడుతారని అనుచరులు అక్కడ ఆగిపోయారు. కొన్ని గంటల వ్యవధిలోని శ్రీపాదరావు ను హతమార్చిన సమాచారం బయటికి ప్రపంచానికి తెలిసింది.

అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి శ్రీపాదరావు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీపాదరావు ఉన్నంతకాలం ఆయన కుటుంబ సభ్యులు కుమారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు.

1991,. ఆగస్టు నుంచి, జనవరి 1995 , వరకు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా శ్రీపాదరావు కొనసాగారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆయన ఇష్ట దైవం, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఇంటి ఇలవేల్పు, రాష్ట్ర సాంకేతిక సమాచార శాసన సభ వ్యవహారాలు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్వర్గీయ శ్రీపాదరావు తనయుడు.