సీఎం రేవంత్ రెడ్డి తో కింగ్ డమ్ రాయబారి భేటీ !

J.SURENDER KUMAR,

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ బుదవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అంశాలు ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.