👉4 వేల ఇళ్ల నిర్మాణానికి పునాది రాయి వేసింది నేనే !
👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
J.SURENDER KUMAR,
డబుల్ బెడ్రూం ఇళ్లలో మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తాం.. అన్ని మతాల ప్రజలకు ఎక్కడ ప్రార్ధనా మందిరాలు నిర్మిస్తామని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అధికారులతో కలిసి, పరిశీలించారు.
ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ… డబుల్ బెడ్రూం ఇళ్లలో మౌలిక వసతులు కల్పనపై అధికారులతో సమీక్షించి, అంచనాలు రూపొందించి, పనులు ప్రారంభించి మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నరు.
ఉగాది నాటికి డ్రైనేజీలు తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మౌలిక వసతులు కల్పించే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
వివిధ గ్రామాల నుండి ఇల్లు లేని నిరుపేదలు ఉపాధి కోసం వచ్చిన వారికి టీఆర్ నగర్ లో ఇల్లు నిర్మించి పంపిణీ చేశామని, అనంతరం 2009లో ఇల్లులేని నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు 111 ఎకరాల భూమి సేకరించి, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద 2009లో 4వేల ఇళ్లకు పునాది వేసింది తానేనని జీవన్ రెడ్డి వివరించారు.
భూమి సేకరించి, స్వంత ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో అర్హులను గుర్తించి 4000 మందికి ఇళ్లు మంజూరు చేశామని అన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్నికల ముందు ఆదరా బాదరాగా డబుల్ బెడ్ ఇళ్లల్లో మౌలిక వసతులు కల్పించకుండానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు.
తాను ఓడిపోయినప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజల సమస్యలు పరిష్కరించే అవకాశం లభించిందన్నారు.

మౌలిక వసతులు కల్పించేందుకు ₹.25కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారన్నారు.
వివిధ దశల్లో నిలిచిన 1600 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు కృషి చేస్తాను. అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇందిరమ్మ లబ్ధిదారులకు తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం కోసం ₹ 5లక్షలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని జీవన్ రెడ్డి అన్నారు. వివిధ మతాల విద్యార్థులు చదువుకునేందుకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మతాల ప్రజల మత విశ్వాసాలకు అనుగుణంగా హిందువులకు రామ మందిరం, ముస్లింలకు మసీదు, క్రైస్తవులకు చర్చి, నిర్మాణం చేపట్టి, అన్ని మతాలను గౌరవిస్తామని జీవన్ రెడ్డి కాలనీవాసులకు హామీ ఇచ్చారు.