జగిత్యాల బీఆర్ఎస్ కౌన్సిలర్ల కు ఎమ్మెల్సీ కవిత కౌన్సిలింగ్!

👉రేపు జగిత్యాల్ వైస్ చైర్మన్ పై వీగనున్న అవిశ్వాసం ?

👉వెనక్కి తగ్గిన కౌన్సిలర్లు..?

J.SURENDER KUMAR,

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల్ మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల కు కౌన్సెలింగ్ చేశారు. ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మంగళవారం హైదరాబాద్ లో కవితతో భేటీ అయ్యారు.
వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ నేతృత్వంలో కౌన్సిలర్లు తో ఎమ్మెల్సీ కవిత కీలక మంతనాలు జరిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ….


పార్టీ అందరికీ అవకాశాలు ఇచ్చిందని, భవిష్యత్తులోనూ సమానావకాశాలు కల్పిస్తుందని అన్నారు. రానున్న కాలంలో పార్టీ మరింత బలోపేతమై ప్రజల ఆశీర్వాదాన్ని సంపాదిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరని స్పష్టం చేశారు.
అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గట్టిగా పోరాటం చేయవలసిన ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి అవిశ్వాస తీర్మానంపై పునరాలోచన చేయాలని ఆమె కోరారు.


దాంతో ఎమ్మెల్సీ కవిత సూచనల మేరకు అవిశ్వాస తీర్మానంపై వెనక్కి తగ్గాలని కౌన్సిలర్లు అక్కడికక్కడే నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నాడు అవిశ్వాస తీర్మానంపై జరగబోయే ఓటింగ్ లో పాల్గొనబోమని కౌన్సిలర్లు ఎమ్మెల్సీలు కవిత ఎల్ రమణ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముందు ప్రకటించినట్టు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలో పేర్కొంది