👉సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
👉ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మీ సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను అని పట్టభద్రులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
సోమవారం జగిత్యాల పట్టణంలో మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ ల సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశంకు జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ. మహిళ సాధికారత, బలోపేతం తోనే కుటుంబం, సమాజం బాగుపడుతుందన్నారు. 2004లో స్వర్గీయ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళా సంఘాల సభ్యులకు అండగా పావలా వడ్డీ పథకాన్ని ప్రారంభించి అమలు చేశారన్నారు. 2009 – 14 మధ్య కాలంలో పావలా వడ్డీ స్థానంలో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలు అయ్యిందని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో వడ్డీ రాయితీ అమలు చేయకపోగా, అమలు ప్రయత్నం సైతం పెండింగ్ లో ఉండడం దురదృష్టకరం అన్నారు. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరిన్ని పథకాలను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఆర్. పీ లకు గత ఏడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదలయ్యేలా చూడడం తో పాటు, ఏప్రిల్ తర్వాత రిసోర్స్ పర్సన్ లకు ₹10 వేల గౌరవ వేతనం అందేలా చూస్తమని, ఇదే తరహాలో గ్రామ స్థాయిలో పనిచేసే VOA లకు సైతం ₹ 10 వేల వేతనం అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. 2014 కు పూర్వం పీఎఫ్ కలిగిన వారికే బీడీ పెన్షన్ వచ్చిందని, తర్వాత క్రమంలో ప్రకటనలు తప్ప 2018తరవాత కొత్తగా ఒక్క బీడీ పెన్షన్ మంజూరు రాలేదన్నారు.
జగిత్యాల పట్టణంలో ఉన్న మెప్మా బిల్డింగ్ ను తిరిగి మెప్మా కే అప్పగించేలా తన వంతు కృషి చేస్తానని జీవన్ రెడ్డి మహిళలకు హామీ ఇచ్చారు.
ఈ సమావేశం లో RP ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పిప్పరి అనిత తో పాటు జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ లు పాల్గొన్నారు.