J.SURENDER KUMAR,
ధర్మపురి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడానికి గురువారం రాత్రి ధర్మపురి క్షేత్రానికి చేరుకున్న మంత్రి దామోదర రాజనరసింహ కు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘనంగా స్వాగతించారు మంత్రి కుటుంబ సభ్యులు రాత్రి ధర్మపురిలో బస చేశారు.

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం మంత్రి దామోదర రాజనరసింహ కుటుంబ సమేతంగా స్వామివారి అభిషేకం , నరసింహ హోమం తో పాటు శ్రీ స్వామివారి కళ్యాణంలో పాల్గొననున్నారు.
