నేడు సుప్రీం కోర్టులు వర్గీకరణ పై వాదనలు !

👉మంత్రి దామోదర్ రాజనర్సింహ ముగ్గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి..

J.SURENDER KUMAR,

ఎస్సీ వర్గీకరణ పై మంగళవారం సుప్రీం కోర్టులో ఏడుగురు న్యాయముర్తుల బెంచి ముందు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రముఖ సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించనున్న నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ నాయకత్వంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారయణ, దుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు , సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు.

దళితులలో జనాభా ప్రాతిపాదికన ABCD వర్గికరణ అంశంపై ఈ నెల 3న హైదరాబాదులో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను మంత్రి దామోదర్ నరసింహ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, కలసి వర్గీకరణ అమలు జాప్యంతో మాదిగ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అంశాల్లో నష్టపోతున్న ఉదంతాలు అడ్వకేట్ జనరల్ కు వివరించారు. ప్రభుత్వ పక్షాన సుప్రీం కోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ తో ఈ భేటీ జరిగింది.