ఎన్ఆర్ఎస్సీ తో ఒప్పందం!


J.SURENDER KUMAR,

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ( ఎన్ఆర్ఎస్సీ ) తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.

బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్​ అండ్​ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో పాటు ఎన్​ ఆర్​ ఎస్​ సీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.