ఒలంపిక్స్ క్రీడలలో సత్తా చాటాలి సీఎం రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

తెలంగాణ క్రీడాకారులు ఒలంపిక్స్ క్రీడలలో తమ సత్తాను చాటి ప్రపంచానికి తమ ప్రతిభను చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ సచివాలయంలో బుధవారం బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్‌ బాల్ బాలికల జట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు.


నెల 21 నుండి 25 వరకు, బీహార్‌లోని పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ లో జరిగిన 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్‌ బాల్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సాఫ్ట్‌ బాల్ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించింది.