👉త్వరలో 197 మార్కెట్ కమిటీలకు కార్యవర్గం !
👉మంత్రి తుమ్మల నాగేశ్వరరావు !
J.SURENDER KUMAR,
త్వరలో నూతనంగా ఏర్పాటు కానున్న ప్రతి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గంలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని ( చైర్మన్, వైస్ చైర్మన్ తో కల్పి ) 12 మంది నామినేటెడ్ సభ్యులు, ఇద్దరు అధికృత వ్యాపారస్తులు, ( లైసెన్స్డ్ ట్రేడర్స్ ) మిగిలిన నలుగురు ఎక్స్ ఆఫివో సభ్యులు. ఉంటారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు.
ఈ పాలక వర్గ పదవీకాలం రెండేళ్లకు ఉండగా వీరిని రెండు సార్లు మరో ఆరు నెలలు కాలం పొడిగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రములో ఉన్న 197 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన కార్యవర్గం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.
ఈ మేరకు ఈనెల 12న ఇప్పటికీ కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ జారీ చేసిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పునర్వైభవం తెచ్చే దిశలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోయే కమిటీలకు సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు.

మార్కెట్ కమిటీలకు నామినేటెడ్ కాబడే ఛైర్మన్ లలో అన్నీ వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం కల్పించనున్నట్లు మంత్రీ వివరించారు.
అదేవిధముగా చిన్న రైతులు, ఇతరులు మరియు పాడి రైతులు కూడా సభ్యులు ఉంటారు. ఈ మార్కెట్ కమిటీలకు ధరల నియంత్రణ, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి / ఎగుమతి వివరాలు, మార్కెట్ యార్డుల నిర్వహణ వంటి భాద్యత అప్పగించబడును.
కావున కొత్తగా ఏర్పాటయే మార్కెట్ కమిటీలు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకొని తెలంగాణ, రైతాంగానికి వారు సేవ చేస్తారని భావిస్తున్నట్టు మంత్రి ప్రకటనలో పేర్కొన్నారు.