త్వరగా మూసీ అభివృద్ధి ప్రక్రియ మొదలు సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మూసీ నదీ పరివాహక అభివృద్ధి పై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో సోమవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.


మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం వివరించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను కోరారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు.