ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆరుగురు మాజీ ముఖ్య మంత్రుల కొడుకులు పోటీ !

J.SURENDER KUMAR,

ఆంధ్రప్రదేశ్ లో 2024 మే మాసంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు కుమారులు శాసనసభ కు పోటీ చేయనున్నారు.


👉పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు.


👉2019లో మంగళగిరి నుంచి గెలిచేందుకు చేసిన తొలి ప్రయత్నం విఫలమవడంతో మూడుసార్లు సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో రెండోసారి పోటీ చేయనున్నారు.


,👉మాజీ ముఖ్యమంత్రిఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్ నటుడు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ బాలకృష్ణ మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.


👉తెనాలి నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీయే తరపున పోటీ చేస్తున్న జనసేన అధినేత ఎన్‌.మనోహర్‌ మాజీ సీఎం ఎన్‌.భాస్కర్‌రావు కుమారుడు.


👉వెంకటగిరి నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మాజీ సీఎం ఎన్‌.జనార్దన్‌రెడ్డి కుమారుడు ఎన్‌.రాంకుమార్‌రెడ్డి పోటీ చేయనున్నారు.


👉మాజీ సీఎం కే.విజయభాస్కర్‌రెడ్డి తనయుడు కే.సూర్యప్రకాష్‌రెడ్డి డోన్ సెగ్మెంట్‌ నుంచి టీడీపీ టికెట్‌పై అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


 ( NDtv సౌజన్యంతో )