కేటీఆర్ ఎంపి గా నిజామాబాద్ కరీంనగర్ నుండి పోటీ చేసే దమ్ముందా ?

👉సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సవాలు హాస్యాస్పదం.!

👉ఎమ్మెల్యే.. సీఎం పదవి ఒక్కటేనా ?

👉పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

J.SURENDER KUMAR,

కేటీఆర్ ఎంపి గా నిజామాబాద్  లేదా కరీంనగర్ నుండి పోటీ చేసే దమ్ముందా ?  ఉంటే పోటీ చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి సవాలు విసిరారు.  సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సవాల్ చేయడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యే సీఎం ఒకటేనా ? బీఆర్ఎస్ ఒక్కస్థానం గెలిచే అవకాశం కూడా లేనప్పుడు మాట్లాడే తీరు ఇదేనా.. అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

👉దమ్ముంటే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి రావాలని కేటీఆర్  సవాలు విసరడం పై నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. వాస్తవాలు తెలుసుకో కేటీఆర్, ఉంటూ హితవు పలికారు.

👉రెండు టీఎంసీ లు ఉపయోగించకుండా  అదనపు టీ ఎం సీ ల కోసం క్రిమినల్ నేరమని అన్నారు.

👉తుమ్మడి హెట్టీ వద్ద 160 టీఎంసీ ల నీరు లభ్యం ఉందని నివేదిక ఉండగా తుమ్మడి హేట్టి నుండి కిందికి దించటానికి మరో నివేదికలో సైతం ఇచ్చారు

👉148 మీటర్ల ఎత్తు బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకుంది. ఒక్క లిఫ్ట్ తో ఎల్లంపల్లి కి నీరు చేరేది..

👉వేదిర శ్రీరామ్ నివేదిక ఇచ్చారు.

👉మెడి గడ్డ పిల్లర్లు కుంగడం టెక్నికల్ లోపం అని పేర్కొంటున్నారు..ఇకనైనా జ్ఞానోదయం చేసుకో..

👉ఉచిత బస్సు రవాణా నూరుశాతం విజయవంతం అయింది.

👉అడ బిడ్డలను గౌరవించడం హిందూ సంప్రదాయం.

👉అడబిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలని అన్నారు.నేటి నుండి గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలు చేస్తున్నాం..

👉ప్రజా పాలనలో ధరకాస్తు చేసుకున్న వారందరికీ 200 యూనిట్ల మాఫీ వర్తిస్తుంది..

👉రేషన్ కార్డు ఉన్న వారు ఎవరైనా ప్రజా పాలనలో ధరకాస్తు చేసుకొని వారు తక్షణమే ధరకాస్తు చేసుకోవాలని సూచించారు.

👉రేషన్ కార్డు లేని వారికి రెండు నెలల్లో రేషన్ కార్డు జారీ. చేస్తామని అన్నారు.
గ్యాస్ కంపెనీలకు ముందే డిపాజిట్ చేస్తున్నాం..సిలిండర్ ధర ఎంత ఉన్నప్పటికీ

👉₹ 500/-  సిలిండర్ అందుతుంది.
నేటితో మూడు గ్యారంటీలు అమలు చేసినం..
ఇండ్ల నిర్మాణాలపై వారం రోజుల్లో నిబంధనలు అమలు పై ప్రకటన చేస్తామన్నారు.


👉అర్హులైన ప్రతి ఒక్కరికీ పార దర్షకంగా ఇళ్ల కేటాయింపు అమలు చేస్తాం..
గత ఏడాది ఫిబ్రవరిలో విద్యుత్  వినియోగం కన్నా ప్రజలు ఈ ఏడాది అధికంగా వినియోగించారు.


👉ఇకనైనా కేటీఆర్ స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హితవు పలికారు. అనంతరం  పోచంపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ లో చేరగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కండువా కప్పి  పార్టీ లోకి ఆహ్వానించారు.