J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణం కు చెందిన కూర్మచలం అనన్య న్యాయ శాస్త్రంలో 8 బంగారు పతాకాలను సాధించింది. ఈ మేరకు అదివారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి ప్రియదర్శిని న్యాయశాస్త్ర డిగ్రీ పట్టాతో పాటు 8 బంగారు పతకాలను అనన్య కు అందించే అభినందించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని ఆంధ్ర మహిళా సభ ‘ లా ‘ కళాశాలలో 2020-2023 లో బ్యాచిలర్ ఆఫ్ లా కోర్సు పూర్తి చేసింది. న్యాయ శాస్త్రంలోని లేబర్ లా, కానిస్టిట్యూషనల్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా, ఫ్యామిలా, లా ఆఫ్ జూరిస్క్రిప్రిడెన్స్ విభాగాలతో పాటు ఎల్ఎల్బీ ఫస్ట్ ఇయర్, ఎల్ఎల్బి సెకండ్ ఇయర్, 2020-2023 బ్యాచ్ లో అత్యుత్తమ విద్యార్థినిగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు కళాశాల యజమాన్యం 8 బంగారు పతకాలతో సత్కరించింది.
అనన్య తండ్రి కూర్మచలం వేణుమాధవ్ జగిత్యాల జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాది కాగా, తల్లి పుష్పలత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. అనన్య భర్త గొనెపట్ల అజయ్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నాడు.
ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ, న్యాయశాస్త్రంలో అత్యుత్తమ స్థాయికి ఎదిగేందుకు, సామాన్యుడికి సత్వర న్యాయం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. అనన్యకు బంగారు పతకాలు రావడం పట్ల న్యాయవాదులు, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు.