వైభవంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం!

👉పాల్గొన్న ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం. శుక్రవారం అంగరంగ వైభవంగా వైభవంగా జరిగింది. రథోత్సవం తిలకించడానికి తరలివచ్చిన భక్తజనంతో ధర్మపురి క్షేత్రం పోటెత్తింది. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు. మూడు రథములపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
బలిహరణాల తర్వాత భక్తుల సందర్శనం అనంతరం వేలాది మంది భక్తజనం గోవింద నామస్మరణలు, హర హర మహాదేవ, అంటూ భక్తి పరవశంతో నినాదాలు చేస్తూ, స్వామివారి రథములను క్షేత్ర పురవీధుల గుండా బ్రహ్మ పుష్కరిణి ,ఇసుక స్తంభం, నంది విగ్రహం వరకు, ఊరేగించారు.


అనంతరం అర్చక స్వాములు స్వామివారి ఉత్సవమూర్తులను పవిత్ర గోదావరి నది లో చక్ర స్నానం , ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రంలో ఊరేగించారు. మధ్వాచారి వంశీయుల ఇంటి లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం వారు మజ్జిగ ప్యాకెట్లు,  పులిహోర ప్యాకెట్లను, భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. పోలీస్ యంత్రాంగం రోప్ పార్టీ పోలీసు బృందాలు, రథాలకు, రథాలకు మధ్య ఇద్దరు ఎస్సైలు, పోలీస్ బలగాలతొ. బందోబస్తు ఏర్పాటు చేసి తొక్కిస్తాలాట జరగకుండా భద్రత చర్యలు చేపట్టారు.

👉భగవంతుని ముందు అందరు సమానమే..

👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన స్వామి వార్ల రథోత్సవం కార్యక్రమంలో  పాల్గొన్న  ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  స్వామి  దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ..


శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి రథోత్సవంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని, భగవంతుని ముందు అందరూ సమానమే అని అన్నారు.  బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నంది విగ్రహం నుండి దేవాలయం వరకు వాహనాలను అనుమతించ లేదన్నారు. భక్తులకు అన్నదాన విషయంలో నాణ్యమైన సన్న బియ్యన్ని వినియోగించాము అని అన్నారు. 

ధర్మపురి నుండి హైదరాబాద్ కి వెళ్ళే ప్రయాణికుల సౌకర్యార్థం  మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి AC బస్సులను ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.

స్వామి వారి కృప ఆశీస్సులు ధర్మపురి ప్రజానికంపై ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే  లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఆలయ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.