బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రేసే బాధ్యత వహించాలి !

👉ములుగు ఎస్సీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర !

👉మావోయిస్టు నేత ఆజాద్!

J.SURENDER KUMAR,


ఇటీవల మహారాష్ట్ర సరిహద్దులో ముగ్గురు కామ్రేడ్స్ పై విష ప్రయోగం చేసి పట్టుకొని అతి కిరాతకంగా హింసించి ఎన్ కౌంటర్ కథ అల్లారు బూటకపు ఎన్ కౌంటర్లకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు నేత ఆజాద్ ప్రకటనలో ఆరోపించారు.


శనివారం బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ తెలంగాణ గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, కోబ్రా పోలీసులకి మావోయిస్టులకు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో మా కామ్రేడ్స్ ముగ్గురు అమరులయ్యారు. అని ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రజల కోసం పోరాడుతున్న మావోయిస్టుల పై అటు తెలంగాణ, ఇటు చత్తీస్ఘడ్ – మహారాష్ట్ర పోలీసులు రాజ్యహింసకు తెగబడుతు కార్పోరేట్ కంపనీల అడుగులకు మడుగులొత్తేలా వారు పనిచేస్తున్నారు, అని ప్రకటనలో పేర్కొన్నారు. హింసలో పార్టీలకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. బీజేపీ, కాంగ్రేస్, బీఆర్ఎస్ అన్ని పార్టీలదీ ఒకటే వ్యూహం, ఒకటే దారి. మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యం తో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్షలు, ప్రతి విమర్షలు చేసుకున్నా పాలించే విధానంలో ఎలాంటి మార్పూ లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న విలువైన ఖనిజాలు, వనరులను పెద్ద పెద్ద కంపనీలకు, సామ్రాజ్య వాద తొత్తులకు గుండుగుత్తగా తాకట్టు పెట్టే క్రమంలో అక్కడ ఉన్న ఆదివాసీ ఉద్యమాలను రాక్షసంగా అనగదొక్కుతున్నారు అని ప్రకటనలో పేర్కొన్నారు.

దండకారణ్యం అంతా పోలీసు క్యాంపులతో నింపేస్తున్నారు. ఓ పక్క డ్రోన్లు, హెలీకాప్టర్లతో ఆకాశ మార్గంగుండా దాడులు చేస్తున్నారు. అంటూ ప్రకటనలో పేర్కొనబడింది.
తెలంగాణ ఎస్ జెడ్సీ సభ్యులు కామ్రేడ్ సాగర్ తో పాటు కామ్రేడ్ మణిరాం ( ఏసీఎం) మరో కామ్రేడ్ ముగ్గురూ అమరులయ్యారు. వారికి మావోయిస్టు పార్టీ ఎర్రెర్ర విప్లవ జ్యోహార్లు అర్పిస్తుంది. ఎన్ కౌంటర్ కు కారకులైన ములుగు ఎస్సీ, పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ మావోయిస్టు ఎజెండానే తన జెండాఅని అధికారం చేపట్టాక మావోయిస్టు నిర్మూలించడానికి ఒక నియంతగా వ్యవహరించాడు. అదే తరహాలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షిస్తానని ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పి మావోయిస్టు పార్టీపై తన పోలీసు బలగాలతో దాడులు చేపిస్తూ పాలించే వాళ్ళంతా ఒకే గూటి పక్షులని ప్రకటనలలో పేర్కొన్నారు.

రాజ్యహింసలో ఒకరిని మించిన వారు ఇంకొకరు అన్నట్లు కార్పోరేట్ ఏజెంట్లే నని రుజువు చేసుకున్నడు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నాం. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో మా కామ్రేడ్స్ పై ములుగు జిల్లా ఎస్పీ పధకం రచించి ఈ ఎన్ కౌంటర్ కు పాల్పడ్డారు అంటూ ఆజాద్ పేరుతో జారీ చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొనబడింది.