24 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు రద్దు – కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు!

J.SURENDER KUMAR,

పశ్చిమ బెంగాల్ లో ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో

రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల ఎంపిక  పరీక్ష-2016

( ఎస్‌ఎల్‌ఎస్‌టి ) రిక్రూట్‌మెంట్ ప్రక్రియ లో 24 వేల మంది

ఉపాధ్యాయుల నియామకం రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు

సోమవారం తీర్పు ప్రకటించింది.


న్యాయమూర్తులు దేబాంగ్సు బసక్, ఎండీ షబ్బర్ రషీద్ లతో కూడిన డివిజన్ బెంచ్  2016 (ఎస్‌ఎల్‌ఎస్‌టి) ద్వారా జరిగిన అన్ని నియామకాలను రద్దు చేస్తూ ఆదేశించింది.
ఈ ప్రక్రియలో దాదాపు 24,000 ఉద్యోగాలను కోర్టు తొలగించింది. నియామక ప్రక్రియకు సంబంధించి తదుపరి విచారణ చేపట్టి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని హైకోర్టు ఆదేశించింది.


తాజాగా నియామక ప్రక్రియను ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ ను ధర్మాసనం ఆదేశించింది. 24,640 ఖాళీ పోస్టుల కోసం 23 లక్షల మంది అభ్యర్థులు SLST-2016 కు హాజరయ్యారు. ఖాళీలకు విరుద్ధంగా మొత్తం 25,753 నియామక లేఖలు జారీ చేసినట్లు పిటిషనర్లలో కొందరి తరఫు న్యాయవాది ఫిర్దౌస్ షమీమ్ తెలిపారు.