J.SURENDER KUMAR,
మనిషి జీవన విధానానికి దిశా నిర్దేశం చూపేదే పంచాంగం అని, తిథి, వార, నక్షత్రము, యోగం, కరణంలతో కూడిన పంచాంగం మనలో ఉండే మేధా సంపత్తిని ప్రజ్వలింప జేస్తాయని, ఐటి, సాంకేతిక, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
క్రోధి నామ సంవత్సర పంచాంగము ను మంత్రి శ్రీధర్ బాబు సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మంథని లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..
హిందు పురాణాల ప్రకారం మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. అవి ప్రతి ఏడాది చైత్రమాసం శుద్ధపాడ్యమి నుంచి ప్రారంభమౌతుంది. అందుకే ఆరోజు నుంచి కొత్త ఉగాది వేడుకలను జరుపుకుంటామని,ఈసారి తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరుతో వచ్చిందన్నారు.
ప్రత్యేకంగా తెలుగు పంచాంగం ఆధారంగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలను ఊహించి చెబుతారనీ… ఇందులో తిథి ఆదాయాన్ని, వారం, ఆయువును, నక్షత్రం పాపప్రక్షాళనను, యోగం వ్యాధి నివారణలను, కరణం పవిత్ర గంగా నదిలో చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని చాలా మంది విశ్వసిస్తారన్నారు.
ఈ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని అందించాలనీ…రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు.
బ్రహ్మశ్రీ గాడిచెర్ల నారాయణ సిధ్దాంతి మనుమడైన బ్రహ్మశ్రీ, గాడిచెర్ల నాగేశ్వరరావు సిధ్దాంతి చే గుణించబడిన క్రోధి నామ సంవత్సర పంచాంగమును జాతీయ దినపత్రిక తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ మద్రణ చేయించారు.
కార్యక్రమంలో న్యాయవాది శశిభూషణ్ కాచె,
మంథని యం.పి.పి.కోండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పంచాంగము ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కు తెలంగాణ రిపోర్టర్, ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.